రవీంద్రభారతి, ఆగస్టు 10 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ముందు కు తీసుకువెళ్లడంతోపాటు గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాయకులంతా ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపు ఇచ్చారు. జైగౌడ్ ఉద్యమం- జాతీయ కమిటీ, శ్రీ సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మపరిపాలన సంస్థ(ఎస్పీడీపీవో)ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 జయం తి వేడుకలు సోమవారం రవీంద్రభారతి లో ఘనంగా నిర్వహించారు.
జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్ సభా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, కర్ణాటక సీఎం ఓఎస్డీ, ఉత్తప్రదేశ్ పీసీసీ మాజీ చీప్ అజయ్లొల్లు, గౌడ్ ఐక్యసాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, బీసీ ఫ్రంట్ చై ర్మన్ బాలగోని బాల్రాజ్గౌడ్ హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. అప్పటి సీఎం కేసీఆర్ పాపన్నగౌడ్ జయంతి, వ ర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని జీవో ఇచ్చారని గుర్తుచేశారు. గీతకార్మికులపై ఎక్సైజ్ దాడులు ఆపాలని డిమాండ్చేశారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జిల్లాగా పేరుపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.