కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన 50మంది ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వైస్ఎంపీపీ శోభలింగం, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రషీద్ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గులాబీ కండువాను కప్పి పార్టీలోని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎదురులేని పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు చూసి అభివృద్ధిలో తాము సైతం భాగస్వాములు అయ్యేందుకు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, నాయకులు లింగంనాయక్, గోపాల్నాయక్, పద్మారావు, శ్రీరాములు పాల్గొన్నారు.