యాచారం : కైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో ఐసీపీసీ కమిటీ ఆధర్యంలో నియోజకవర్గస్థాయి పాస్టర్స్ అండ్ ఫ్యామిలీలతో సెమి క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలకు చెందిన మత పెద్దలు క్రీస్తు జీవిత చరిత్రను తమ సందేశం ద్వారా అందజేశారు. ఏసుక్రీస్తును స్మరిస్తూ పాటలు పాడారు. చిన్నారులు నృత్యాలు చేశారు. అనంతరం పాస్టర్స్ను ఘనంగా సన్మానించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ క్రైస్తవులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం పేదలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తుందన్నారు. సోదరులందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.