కొత్తూరు రూరల్ : ప్రభుత్వం నుంచి ప్రజలకు, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతలో రాజీపడొద్దని తెలంగాణ ఆహార భద్రత కమిషన్ సభ్యులు భారతి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ సెంటర్ను తెలంగాణ ఆహార భద్రత కమిషన్ సభ్యులు గోవర్ధన్రెడ్డి, భారతి, శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందచేస్తున్న మధ్యాహ్నా భోజనం, పాలు, గుడ్లు, బాలామృతం తదితర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అక్కడి నుంచి కొత్తూరు మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో ఏపీఎం కొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ సెంటర్లో అందించే సేవలు, పౌర సరఫరాలు, కేసీఆర్ కిట్ వంటి వాటిపై కార్యవర్గ సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ గంగిరెడ్డి, ఏపీఎం కొండయ్య, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ఖలీల్, రాజప్ప, అధ్యక్షులు అలివేలు, లక్ష్మమ్మ, లావణ్య, సునిత పాల్గొన్నారు.