రంగారెడ్డి, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలోని రైతులకు పారదర్శకంగా సేవలందుతున్నాయి. డబ్బుతోపాటు సమయం కూడా ఆదా అవుతున్నది. గతంలో మాదిరిగా కాకుండా వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగా ఎప్పటికప్పుడు జిల్లాలోని రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా మ్యుటేషన్లు, సక్సేషన్స్, ప్రొహిబిటెడ్, జీపీఏ తదితరాలకు సంబంధించి లక్షా18 వేలకుపైగా దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 99శాతం దరఖాస్తులను అధికారు లు పరిష్కరించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచింది. వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగా జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ పరిష్కరిస్తున్నారు. మిగతా జిల్లాల మాదిరిగా కేవలం సోమవారం ‘ప్రజావాణి’లోనే వినతులను స్వీకరించడమే కాకుండా ప్రతిరో జూ తానే స్వయంగా రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లాతోపాటు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శభాష్ అనిపించుకుంటున్నారు.
99 శాతం దరఖాస్తుల పరిష్కారం..
రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్కు లక్షా18 వేలకుపైగా దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 99 శాతం దరఖాస్తులను జిల్లాలోని రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని ఆయా మండలాల తహసీల్దార్ల వరకు తమ లాగిన్కు వచ్చే దరఖాస్తులకు వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్ర స్తుతం ధరణి పోర్టల్ ద్వారా మ్యుటేషన్లు, సక్సేషన్స్, ఆధార్ సీడింగ్, జీపీఏ, ఆర్గనైజేషన్ పీపీబీ, ప్రొహిబిటెడ్ జాబితా, పీపీబీ లేకుండా సక్సేషన్, కోర్టు కేసుల ద్వారా పీపీబీ, పాస్ పుస్తకం లేకుండా నాలా, కోర్టు కేసు-ఇంటిమేషన్, పీపీబీ-నాలా, అన్లాక్ పీపీబీ ఆఫ్ పీపీ ఆప్షన్లు సంబంధిత దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపుతున్నారు.
అదేవిధంగా ఆయా ప్రాంతాలను బట్టి పోర్టల్లోనే స్టాంప్ డ్యూటీ ధరలను చూపుతుండటంతో డాక్యుమెంట్ రైటర్స్ కానీ, మీసేవా కేం ద్రాల నిర్వాహకులు గానీ అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు వీలులేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా పోయిం ది. గతంలో మాదిరిగా మారుమూల గ్రామం నుంచి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సక్సేషన్ తదితర సేవల కోసం రైతులు పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండా.. మండల కేంద్రాల్లోనే సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా అధికారులు ఎప్పటికప్పుడు దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు.
గతంలో వారసత్వంగా వచ్చే భూములను వారసుల పేరిట మార్చేందుకు రైతులు ఏండ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. 45 రోజుల్లో పూర్తి కావాల్సిన వారసత్వ రిజిస్ట్రేషన్ ఏండ్లు గడిచినా పూర్తయ్యేదికాదు. ప్రస్తుతం రైతులకు ఆ బాధలన్నీ తప్పాయి. వారసత్వ రిజిస్ట్రేషన్ కోసం పట్టాదారు పాసు పుస్తకం, పట్టాదారు మరణ ధ్రువీకరణపత్రం, కుటుంబసభ్యుల అంగీకార పత్రం, ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులతో మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడం.. కుటుంబసభ్యుల పేరిట కొత్త పట్టాదారు పాసు పుస్తకం జారీ కావడంతోపాటు ఒరిజినల్ పట్టాదారు పాసు పుస్తకం రైతుల ఇంటికే వస్తున్నది. ఇప్పటివరకు 1,16,857 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకున్నాయి.
సత్వరమే పరిష్కరిస్తున్నాం
జిల్లాలో ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తున్నాం. తన లాగిన్కు వచ్చే ఏ ఒక్కా దరఖాస్తును కూడా పెండింగ్లో ఉంచడంలేదు. పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నా. ధరణి పోర్టల్తో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పారదర్శక సేవలు అందుతున్నాయి.
– అమయ్కుమార్, కలెక్టర్ రంగారెడ్డి