తలకొండపల్లి, సెప్టెంబర్18 : ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని చంద్రధన గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. తెలంగాణలో వారి ఆటలు సాగవన్నారు. ప్రజల చేతిలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్నాయక్, రాఘవేందర్, రాజు, కుమార్, రామకృష్ణ, శంకర్, శివకుమార్, మహేందర్, వెంకటేశ్, శివకుమార్, గణేశ్, నిరంజన్, రమేశ్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు భరోసా
బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామానికి చెందిన అశ్వినికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన లక్ష రూపాయల చెక్కును ఆదివారం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.