షాబాద్, సెప్టెంబర్ 18: ఎంపీ రంజిత్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం చేవెళ్లలోని వేంకటేశ్వరస్వామిని ఎంపీ దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎంపీ కేక్ కట్ చేశారు. భారీ గజమాలతో ఎంపీని సన్మానించారు. నగరంలో షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఎంపీని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు మర్పల్లి మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు విజయలక్ష్మి, గోవర్ధన్రెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, సర్దార్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, గోపాల్, వాసుదేవ్కన్నా, శేరిగూడ సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ ఇంద్రాసేనారెడ్డి, నా యకులు కృష్ణారెడ్డి, నాగార్జునరెడ్డి, రంగారెడ్డి, మాణిక్యరెడ్డి, ప్ర వీణ్కుమా ర్ పాల్గొన్నారు.