న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ: అన్ని విధాలా వెనుకబడిన గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేయడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ నగరంలో జరిగిన బహిరంగ సభలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వారం రోజుల్లో జీవోను జారీ చేస్తామని చెప్పడంతోపాటు దళితబంధులాగే గిరిజనబంధును కూడా అమలు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పడంతో గిరిజన సంఘాల నాయకులు, మహిళలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు.
గత ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకోలేదు
సీఎం కేసీఆర్ గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్ను అమలు చేస్తామని ప్రకటించి గిరిజన బాంధవుడిగా మారారు. దీని ద్వారా చదువుకున్న గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. దళితబంధు మాదిరిగా త్వరలోనే గిరిజనబంధును కూడా ప్రకటిస్తామని చెప్పడం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలోని గిరిజనులు ఆయన మేలును ఎప్పటికీ మరువరు. గత ప్రభుత్వాలు గిరిజనులకు ఎటువంటి రిజర్వేషన్లు కల్పించలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలుకు త్వరలోనే జీవోను జారీ చేస్తామని చెప్పినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. – నర్మద, ఎంపీపీ మంచాల
గిరిజనులకు మేలు జరుగుతుంది
సీఎం కేసీఆర్ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ను అమలు చేస్తే ఎంతోమంది గిరిజనుల జీవితాలు బాగుపడుతాయి. గిరిజన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో మరింత మేలు జరుగుతుంది. తెలంగాణ సర్కార్ వెనుకబడిక కులాల అభ్యున్నతికి చర్యలు తీసుకోవడం చాలా సంతోషకరం. గిరిజనబంధును కూడా అమలుచేస్తే పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. గిరిజనుల బాగుకోసం గిరిజన బంధు, పదిశాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు
– సుజాత, హిందీ పండిత్ నంబర్-1 స్కూల్ తాండూరు
గిరిజనబంధు చరిత్రాత్మక నిర్ణయం
గిరిజనబంధు చరిత్రాత్మక నిర్ణయం. సీఎం కేసీఆర్ దళితబంధు తరహాలోనే గిరిజనబంధును కూడా ప్రకటించడం ఎంతో అభినందనీయం. గిరిజనుల్లో ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వ త్రా హర్షం వ్యక్తవుతున్నది. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.
– ధర్మ, లోయపల్లి, ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునసాగర్, ఇబ్రహీంపట్నం
గిరిజనులు రుణపడి ఉంటారు
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల కు స్వయంపాలన అందించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. తాజాగా దళితబంధు మాదిరిగా త్వరలోనే గిరిజన బం ధును కూడా ప్రకటిస్తామని చెప్పడం స్వాగతిస్తున్నాం. దీని ద్వారా గిరిజనుల్లో పేదలు ఆర్థికంగా ఎదుగుతారు. సీఎం కేసీఆర్కు గిరిజనులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
– రాములునాయక్, టీటీఈ రిటైర్డ్, రైల్వే ఉద్యోగి, బొంరాస్పేట మండలం
గిరిజనుల బతుకుల్లో వెలుగులు నిండుతాయి..
తరతరాలుగా వివక్షకు గురవుతున్న గిరిజనుల బతుకుల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన గిరిజనబంధు పథకంతో వెలుగులు నిండనున్నాయి. గిరిజనబంధు పథకాన్ని ప్రకటించి సీఎం కేసీఆర్కు గిరిజ నులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లోనే గిరిజనులకు సమాజంలో గుర్తింపు లభించింది.
– మంజులానాయక్, వైస్ ఎంపీపీ, నందిగామ
సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు
గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. దళితబంధు మాదిరిగానే గిరిజనుల అభ్యున్నతికి గిరిజనబంధును కూడా త్వరలో అమలు చేస్తామని సీఎం ప్రకటించడం సంతోషకరం. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తున్నది. తాజాగా గిరిజనులకు కూడా10 శాతం రిజ ర్వేషన్లను కల్పిస్తూ వారంలో జీవోను జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం గొప్ప పరిణామం. గిరిజనులంతా సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
-అంగోతు మంజుల, మార్కెట్ కమిటీ డైరెక్టర్, షాబాద్
సీఎం నిర్ణయం హర్షణీయం
సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ను కల్పిస్తామని ప్రకటించడం హర్షణీయం. దీని ద్వారా చదువుకున్న గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. దళితబంధు మాదిరిగా త్వరలోనే గిరిజన బంధును కూడా ప్రకటిస్తామని చెప్పడం స్వాగతిస్తున్నాం. ఇప్పటికే గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి తం డాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారు.
-కాట్రావత్ రాంచందర్, మెదక్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారి, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కులకచర్ల
తక్షణమే రిజర్వేషన్ను అమల్లోకి తేవాలి
గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ను కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి రిజర్వేషన్ను కల్పించేందుకు చర్యలు తీసుకోవడం హర్షణీయం. రాష్ట్రంలోని గిరిజనులందరూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు. తక్షణమే పది శాతం రిజర్వేషన్ను అమల్లోకి తీసుకురావాలి.
-రవికుమార్ ఎస్ఏ, తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు, వికారాబాద్ జిల్లా
గిరిజనులు అభివృద్ధి చెందుతారు
సీఎం కేసీఆర్ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. గిరిజనుల అభివృద్ధికి గిరిజనబంధును ప్రకటించడం హర్షణీయం. ఈ పథకం ద్వారా పేదరికంలో ఉన్న గిరిజనులు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతే గిరిజనులకు సమాజంలో గుర్తింపు లభించింది. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు స్వయం పాలన అందించిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతుంది. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం అభినందనీయం.
-జర్పుల దశరథ్నాయక్, జడ్పీటీసీ, కడ్తాల్ మండలం
వారం రోజుల్లో జీవో జారీ సంతోషకరం
వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు కృషి చేయలేదు. సీఎం కేసీఆర్ ఎస్టీల వెనుకబాటుతనాన్ని గుర్తించి గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తానని ప్రకటించడం అభినందనీయం. దీని ద్వారా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా పది శాతం రిజర్వేషన్కు సంబంధించిన జీవోను వారం రోజుల్లో జారీ చేస్తానని చెప్పడం సంతోషకరం. ఎస్టీ విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో ఎంతో మేలు జరుగుతుంది.
-రాఘవన్నాయక్, అఖిల భారతీయ గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు