పరిగి, సెప్టెంబర్ 16: భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం పరిగిలోని మినీ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రాచరికపు పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగిడిన రోజు సెప్టెంబర్ 17 అని, ఇది ముమ్మాటికి సమైక్యతా దినోత్సవమేనని తెలిపారు. చరిత్రలో చిరస్మరణీయమైన రోజు సెప్టెంబర్ 17 అని చెప్పారు. గత పాలకులు ఎవరూ తెలంగాణ సమైక్యతా ఉత్సవాలు నిర్వహించలేదని, సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
మూడు రోజులపాటు సంబురాలు నిర్వహించి, ఆనాటి పోరాట యోధులను స్మరించుకోవడంతోపాటు కవులు, కళాకారులను ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో అన్ని వర్గాలవారు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని దశ దిశలా చాటి చెప్పేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకు న్నాయి. భరతనాట్యం చేసిన మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల విద్యార్థిని నిఖిత, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని కీర్తిలకు నిజాం పేట్మేడిపల్లికి చెందిన నర్సింహులు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున చెక్కు లను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి చేతులమీదుగా అందజేశారు.
కార్యక్రమంలో వజ్రోత్సవాల నోడల్ ఆఫీసర్లు డీఆర్డీవో కృష్ణన్, జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్, పరిగి, కులకచర్ల ఎంపీపీలు కరణం అరవిందరావు, సత్యమ్మ, జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్నాయక్, శ్రీనివాస్రెడ్డి, పరిగి, కులకచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎ.సురేందర్, హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, రాజేందర్రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం పరిగి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొడంగల్ చౌరస్తాలో ర్యాలీని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. కొడంగల్ చౌరస్తా నుంచి బహార్పేట్, బస్టాండ్, టెలిఫోన్ ఎక్సేంజ్ల మీదుగా మినీ స్టేడియం వరకు తివర్ణ పతాకాలు చేత పట్టుకొని పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 16 : రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన దిశగా పరివర్తన చెంది, విశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు సెప్టెంబర్ 17అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవా రం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా వికారాబాద్ లో మొదటి రోజు కార్యక్రమాన్ని కలెక్టర్ నిఖిలతో కలిసి కలెక్టరేట్ నుంచి సంఘం లక్ష్మీబాయి పాఠశాల వరకు జాతీయ జెండాలతో విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు.
అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేశ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ చంద్రకళ, ఆర్డీవో విజయకుమారి, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, జిల్లా అధికారులు హన్మంత్రావు, రేణు కాదేవి, సంఘం లక్ష్మీబాయి పాఠశాల ప్రిన్సిపాల్ రమణమ్మ, కౌన్సిలర్ అనంత్రెడ్డి, పార్టీ నాయకులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
తాండూరు, సెప్టెంబర్16: రాచరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి తెలంగాణ అడుగుపెట్టి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు నిర్వహిస్తున్న సంబురాలు ప్రతి వ్యక్తిలో జాతీయ స్ఫూర్తిని చాటుతున్నాయి. శుక్రవారం తాండూరులో విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలు చేస్తూ తాండూరు పట్ట ణంలో భారీ ర్యాలీ తీశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ జాతి నిర్మాతల త్యాగాలను స్మరిం చుకుంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు రూపొందించారని తెలిపారు. మన రాష్ట్రం.., మన దేశం.., మనమంత భారతీయులమన్నారు. సమ సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలన దశకు పరివర్తన చెందిన రోజని తెలిపారు.
ఆర్డీవో అశోక్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయినుంచే విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో మంచిగా చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారన్నారు. కార్య్ర కమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప,కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థులు, ఉపాధ్యాయు లు పాల్గొన్నారు.
కొడంగల్, సెప్టెంబర్ 16: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించి, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహిరంగ సభ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే నేడు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనం గడుపుతున్నామన్నారు.
తెలంగాణ పోరాటంలో కొడంగల్కు ప్రత్యేక స్థానం ఉందని, ఆవుల చిన్న య్య వీరమరణం పొందడతోపాటు ఎందరో జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ పోరాటయోధులు నర్సిరెడ్డి, గోవింద్గౌడ్ లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణితో పాటు ఐదు మండలాల ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.