షాబాద్, సెప్టెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతను చాటేలా తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలు నిర్వహించడం సంతోషకరమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి షాబాద్ చౌరస్తా వరకు నిర్వహించిన వజ్రోత్సవాల ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం నిర్ణయించడం గొప్ప పరిణామమని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు, ఏసీపీ రవీందర్రెడ్డి, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, గోవర్ధ్దన్రెడ్డి, కాలె జయమ్మ, గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, మర్పల్లి మాలతి, గోవిందమ్మ, కాలె జయమ్మ, కాలె శ్రీకాంత్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రశాంత్గౌడ్, శివనీల, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ, శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం : తెలంగాణ జాతీయ సమైక్యతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాకం చేతబూని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పాతబస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం, అంబేద్కర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, ఏసీపీ ఉమామహేశ్వర్రావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సుమారు 10 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ…హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నైజాం పాలనలో ఉన్న మనమందరం రజాకార్ల చేతిలో అనేక ఇబ్బందులకు గురయ్యామని, అప్పటినుంచే తెలంగాణలో పోరాటాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి కూడా మరువలేనిదన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఊరూరా ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ కృపేశ్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృపేశ్, మంచాల ఎంపీపీ నర్మద, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, సహకార సంఘం జిల్లా వైస్ చైర్మన్ సత్తయ్య, టీఆర్ఎస్ ఉద్యమ రచయిత బోడ చంద్రప్రకాశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చీరాల రమేశ్, బుగ్గరాములు, రమేశ్గౌడ్, కిషన్గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
షాద్నగర్ : మన దేశంపై భక్తి, మన రాష్ట్రంపై ప్రేమ అన్ని వర్గాల ప్రజలకు ఉండాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకను పురస్కరించుకొని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతో దేశానికి విముక్తి జరిగిందన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే మన తెలంగాణ ప్రజలకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందన్నారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ వేల సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని, రాష్ట్ర, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు షాద్నగర్ పట్టణంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యకూడలిలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశానికి హాజరైన సుమారు 15 వేల మందికి భోజన వసతిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, బంగారు స్వరూప, ఆర్డీవో రాజేశ్వరి, ఎంఈవోలు శంకర్రాథోడ్, మనోహర్, ఎంపీడీవో వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.