షాబాద్, సెప్టెంబర్ 3 : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం షాబాద్ మండలంలోని గొల్లూరుగూడ, ముద్దెంగూడ గ్రామాల్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేసి ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఆసరా పథకం కింద నెలకు రూ.2016 అందిస్తుండడంతో లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. పేదల కోసం నిరంతరం పాటుపడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూలక్షా116 అందించి అండగా నిలుస్తున్నారని చెప్పారు.
సర్కార్ దవాఖానల్లో కాన్పులు చేయించుకున్న మహిళలకు కేసీఆర్ కిట్తో పాటు రూ.13వేల నగదు అందిస్తున్నదన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రూ.12కోట్లతో షాబాద్ పహిల్వాన్, చందనవెళ్లి చెరువులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. చెరువు కట్టపై అభివృద్ధి పనులకు జడ్పీ నుంచి నిధులు అందించామని తెలిపారు. ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో నగరానికి దగ్గర్లో ఉన్న షాబాద్ మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తుంటే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ధరల పెంపుపై కేంద్రంపై నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు పింఛన్లు సరిగ్గా ఇచ్చేవారు కాదని.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయినంకనే రూ.2016, 3016 ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పేదలు, రైతుల పక్షపాతిగా అనేక పథకాలు అమలు చేసి అండగా నిలుస్తున్నదన్నారు. ఆసరా ఫించన్లే కాకుండా రైతు బంధుతో ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నట్లు చెప్పారు.
గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా రైతుల గురించి ఆలోచించలేదని, ప్రస్తుతం రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడవద్దనే ఉద్దేశంతో ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5లక్షలు బీమా పథకాన్ని వర్తింపజేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ఎండాకాలం వచ్చిందంటే నీటి ఇబ్బందులు చాలా ఉండేవని.. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించి ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయా గ్రామాలకు బీటీ రోడ్లు వేయించినట్లు తెలిపారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అనే వారికి.. తెలంగాణలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. పింఛన్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న రశీదులను సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న, మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, సర్పంచులు జయమ్మ, నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడుప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, ఉప సర్పంచులు ప్రతాప్రెడ్డి, విజయ్భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నర్సింహులు, యాదయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, మిషన్ భగీరథ ఏఈ శారద, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, జీవన్రెడ్డి, రాజేందర్రెడ్డి, సుదర్శన్, నర్సింహులు, భూపతిరాజు, పాపిరెడ్డి, లింగం, శంకర్, దేవేందర్రెడ్డి, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.