ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 2 : పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పింఛన్ లబ్ధిదారులకు శుక్రవారం ఆసరా కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ఓ గార్డెన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన 889మంది, ఆదిబట్ల మున్సిపాలిటీల 313, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకి చెందిన 574మంది, మొత్తం ఇబ్రహీంపట్నం మండలంలోని 1776మంది లబ్ధిదారులకు శుక్రవారం ఆయన కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు విడుతల వారీగా ఆసరా కార్డులను అందజేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులందరికీ పింఛన్ ఈనెల నుంచే అందుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షపార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్మన్లు కప్పరి స్రవంతి, వైస్ఎంపీపీ వెంకటప్రతాప్రెడ్డి, వైస్చైర్మన్లు కోరె కళమ్మ, ఆకుల యాదగిరితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పింఛన్దారులు పాల్గొన్నారు.