ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్ట్టు 17 : అద్భుతమైన రహదారుల నిర్మాణంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తులేకలాన్-ఆగాపల్లి గ్రామాల మధ్యన రెండుకిలోమీటర్ల మేర డబుల్రోడ్డు నిర్మాణం పనులను రూ.3.09 కోట్లతో ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ రోడ్డు నిర్మాణంతో సాగర్ – శ్రీశైలం రహదారుల అనుసంధానం పూర్తికానుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రోడ్లు అధ్వానంగా ఉండేవన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో రూ. 503 కోట్ల వ్యయంతో 22 డబుల్ రోడ్లు నిర్మించి ప్రగతి బాటలు వేశారని చెప్పారు. రూ.89 కోట్లతో యాచారం – మీర్ఖాన్పేట్, రూ. 40 కోట్ల వ్యయంతో నందివనపర్తి – మేడిపల్లి, రూ.58 కోట్లతో ఎలిమినేడు మంగల్పల్లి, రూ.32 కోట్లతో పోల్కంపల్లి – అనాజ్పూర్ రోడ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని వివరించారు. నియోజకవర్గంలో అద్బుతమైన రోడ్లు నిర్మించడంతో గ్రామాలకు రవాణా మెరుగుపడి పరిశ్రమలు, సంస్థల స్థాపనకు ఔత్సాహికులు ముందు కు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ మహిపాల్, సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ బీరప్ప, ఆర్అండ్బీ ఏఈ శ్రీహరి పాల్గొన్నారు.
ఉప్పరిగూడలో గ్రామ దేవతల ఆలయాలు ప్రారంభం
ప్రతి ఒక్కరు దైవచింతనను అలవర్చుకున్నప్పుడే ఆ గ్రామాలు సుఖసంతోషాలతో ఉంటాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఉప్పరిగూడ గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్మించిన రెండు గ్రామ దేవతల ఆలయాలను ప్రారంభించారు. సర్పంచ్ బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల వద్ద ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి పనుల్లో భాగస్వాములవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, వైస్ ఎంపీపీ వెంకటప్రతాప్రెడ్డి, లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నందారెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, వార్డుసభ్యులు శ్రీనివాస్, జగన్మోహన్రెడ్డి, జితేందర్రెడ్డి, పద్మమ్మ, లలిత, శ్రీవేణి, శశిరేఖ, అనిత, మహేందర్, కోఆప్షన్ సభ్యులు సురేందర్రెడ్డి, గోపాల్, మమతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
మంచాల : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. ఆగపల్లి గ్రామం లో నూతనంగా నిర్మించిన ఊరపోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బర్ల జగదీశ్ యాదవ్, గండికోట జంగయ్య, సర్పంచ్ గోసుల జంగయ్య, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు బర్ల మంగ, మమత, నీలం శ్వేత, నీళ్ల బాను, జెర్కోని బాల్రాజ్, రవీందర్ పాల్గొన్నారు.