ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల జెండా రెపరెపలతో ఉమ్మడి జిల్లా మురిసిపోయింది. రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్గ్రౌండ్లో మంత్రి సబితారెడ్డి జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం మాట్లాడారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు జాతీయ జెండాలను ఎగురవేయగా, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధ్యాయులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. – నమస్తే తెలంగాణ, నెట్వర్క్