యాచారం, ఆగస్టు 15 : నగరశివారులోని ఓ ఫామ్హౌజ్లో కొందరు యువకులు ఎయిర్గన్తో గాల్లో కాల్పులు జరిపిన ఘటన సోమవారం సాయంత్రం తీవ్రకలకలం రేపింది. పుట్టిన రోజు వేడుకల్లో ఎయిర్ తుపాకీతో జోష్గా గాల్లో కాల్పులు జరుపుతూ తీసిన వీడియోను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. వీడియో ఒక్కసారిగా వైరల్గా మారి హల్చల్ చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నజ్దిక్సింగారం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫాం హౌజ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. గత నెల 14న కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన విఘ్నేశ్వర్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను తన మిత్రులు 15మందితో నజ్దిక్సింగారం గ్రామ శివారులో కందుకూరు మండలం దెబ్బడగూడ ఫామ్హౌజ్లో జరుపుకొన్నాడు. వేడుకల్లో భాగంగా విఘ్నేశ్వర్రెడ్డి, విక్రం ఎయిర్గన్తో గాల్లో కాల్పులు జరుపుతూ సంబురాలు చేసుకున్నారు. వీడియోలు తీసి వాట్సాప్లో పెట్టారు. దీంతో ఇది వైరల్గా మారింది విషయం తెలుసుకున్న సీఐ లింగయ్య తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ముమ్మరంగా విచారణ చేపట్టారు. అక్కడ పనిచేసే వర్కర్లను అడిగితెలుసుకున్నారు. యువకులు గాల్లో కాల్పులు జరిపిన తుపాకీని ఒరిజినల్ కాదని నిర్దారించారు. ఎయిర్ గన్ మోడల్-35గా గుర్తించారు. అక్కడున్న తుపాకీని, అందులో వాడే రైఫిల్ ఫిల్లెట్స్, తుపాకి కొన్న బిల్లును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.