షాబాద్, ఆగస్టు 13: జాతీయ సమైక్యతకు స్ఫూర్తిగా ప్రతి పల్లెలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం నియోజకవర్గంలోని శంకర్పల్లి, చేవెళ్లలో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారు. షాబాద్, మొయినాబాద్ మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీల ఆధ్వర్యంలో వజ్రోత్సవాల ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆర్డీవో వేణుమాధవ్రావు, ఆయా మండలాల జడ్పీటీసీలు అవినాశ్రెడ్డి, మర్పల్లి మాలతి, గోవిందమ్మ, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, గోవర్ధన్రెడ్డి, గునుగుర్తి నక్షత్రం, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, షాబాద్ సర్పంచ్ తమ్మలి సుబ్రమణ్యేశ్వరి, ఎంపీటీసీ అశోక్, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, గూడూర్ నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా, ఎంపీడీవోలు రాజ్కుమార్, అనురాధ, వెంకయ్య, సంధ్య, తహసీల్దార్ నయీముద్దీన్, ఎంఈవో వెంకటయ్య పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బృందం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున జెండాల పంపిణీతో పాటు ర్యాలీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్ జడ్జి ఇందిర, న్యాయమూర్తులు రాజు, అనామిక, ఎంపీపీ కృపేశ్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో క్రాంతికిరణ్, ఏసీపీ ఉమామహేశ్వర్రావు, సీఐ సైదులుతో పాటు పలువురు న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున జెండాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరులో నిర్వహించిన ఫ్రీడంరన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పాల్గొన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఫ్రీడంరన్ నిర్వహించారు. యాచారం మండల కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడంరన్ కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొన్నారు. మంచాల మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజల్లో దేశభక్తి
స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో అన్ని వర్గాల ప్రజల్లో దేశభక్తి గుండెల నిండా నిండి ఉందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా పట్టణంలోని మినీ స్టేడియం నుంచి పట్టణ పురవీధుల గుండా భారీ జెండాతో ర్యాలీని నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ షాద్నగర్ పట్టణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ వజ్రోత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జాతీయ పతాకాలతో షాద్నగర్ నియోజకవర్గమంతా జెండా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ర్యాలీలో భాగంగా విద్యార్థులు వివిధ వేషధారణాలతో అందరిని ఆకట్టుకున్నారు. నందిగామ, కొత్తూరు మండల కేంద్రాలతో పాటు కొత్తూరు మున్సిపాలిటీ, వివిధ గ్రామాలలో వజ్రోత్సవాలలో నందిగామ ఎంపీడీవో బాల్రెడ్డి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, సర్పంచ్ వెంకట్రెడ్డి, కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, కొత్తూరు మున్సిపల్ చైర్మన్ లావణ్య, వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ వై. రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, ఎంపీడీవో వినయ్కుమార్, కేశంపేట తహసీల్దార్ మురళీ కృష్ణ, కౌన్సిలర్లు అంతయ్య, రాజేశ్వర్, సర్వర్పాషా, శ్రీనివాస్, నర్సింహ, మాధురి, నాయకులు నారాయణ, జూపల్లి శంకర్, యుగేందర్, శేఖర్, సుధాకర్, గోపాల్, లక్ష్మీనర్సింహారెడ్డి, నర్సింహులు, శరత్, మహేశ్వర్ పాల్గొన్నారు.
తట్టిఅన్నారంలో ఫ్రీడం రన్
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తట్టిఅన్నారంలోని శ్రేయాస్ కాలేజీ నుంచి ఇందు అరణ్య వరకు రెండు కిలోమీటర్లు ఫ్రీడం రన్ నిర్వహించారు. వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. ఫ్రీడం రన్ను కమిషనర్ పీ రామాంజులరెడ్డి జెండా ఊపి ప్రారంభించగా.. కౌన్సిలర్లు మద్ది శ్రీధర్రెడ్డి, తొండాపు రోహిణి బ్రహ్మానందరెడ్డి, పాశం అర్చన, దేవిడి గీత, రమావత్ పరశురాం, నాయకులు పాశం దామోదర్, సన్రైస్ తదితర స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఊరూరా జెండాల పంపిణీ
మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. మర్రిపల్లిలో స్థానిక కౌన్సిలర్ పాశం అర్చన ఇంటింటికీ జెండాలు పంపిణీ చేశారు. మరోవైపు అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారామతిపేట గ్రామంలో సర్పంచ్ మూల మహేశ్గౌడ్, ఎంపీటీసీ చేగూరి వెంకటేశ్, ఉపసర్పంచ్ నర్సింహ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జెండాలు పంపిణీ చేశారు.
మాడ్గుల : జడ్పీహెచ్ఎస్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి అధికారులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మ, ఎంపీడీవో ఫారూఖ్హుస్సేన్, సీఐ కృష్ణమోహన్, నాయకులు విష్ణు, మహేశ్, ఉపాధ్యాయులు రామాంజన్రెడ్డి, శ్రీనివాసులు, ఎంపీటీసీ లక్ష్మమ్మ పాల్గొన్నారు.
మహనీయుల త్యాగ ఫలమే..
కడ్తాల్ : రావిచేడ్ గ్రామంలో నిర్వహించిన ఫ్రీడం రన్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించారు. ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడారు. మండల వ్యాప్తంగా ర్యాలీలు కొనసాగాయి. కార్యక్రమంలో సర్పంచ్ భారతమ్మ, ఉప సర్పంచ్ వెంకటేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తలకొండపల్లి : దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఇంటింటికీ జాతీ య జెండాలను పంపిణీ చేయడంలేదని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇం టిపై జాతీయజెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జెండా లను పంపిణీ చేస్తున్న దని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలానికి 12,500 జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారుల కార్యాలయాలు తాళం వేయడం సరికాదని, సమస్యలుంటే ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్య క్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివా స్రెడ్డి, ఎంపీడీవో రాఘవులు, తహసీల్దార్ కృష్ణ, నర్సింహ, శంకర్, స్వప్న, జయమ్మ, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీకి పుట్టగతులుండవ్
ఆమనగల్లు : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీకి పుట్టగతులుండవని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదన్నారు. ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం గడుతారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసి అనురాధ, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.