ఇబ్రహీంపట్నం, జూలై 24 : మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లతోపాటు మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరూరా, వాడవాడలా మొక్కలు నాటారు. పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్లో గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్ కార్తీక్రెడ్డి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సేవకు నిర్వచనం టీఆర్ఎస్, సేవకు కేరాఫ్ అడ్రస్ కేటీఆర్ అని కార్తీక్రెడ్డి కొనియాడారు.
కేటీఆర్ పిలుపుతో పాఠశాల బాగు కోసం టీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా కదంతొక్కారు. యువనేత కార్తీక్రెడ్డితోపాటు పలువురు నేతలు పాఠశాలలను దత్తత తీసుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలం షరీఫ్గూడ గ్రామ పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు కార్తీక్రెడ్డి ప్రకటించారు. ఈ పాఠశాల అభివృద్ధితోపాటు ఇక్కడ చదువుతున్న పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని ఆయన ట్విట్టర్లో 677777783 తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పుట్టిన రోజును అందరిలాగా కాకుండా సామాజిక కోణంలో జరుపుకోవడం మంత్రి కేటీఆర్ ప్రత్యేకతని పేర్కొన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట ఏటా నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని చెప్పారు. పుట్టినరోజు పేరుతో వృథా ఖర్చులు చేయకుండా పెద్దఎత్తున నేతల ద్వారా విరాళంగా ఇప్పించిన అంబులెన్సులు ఎందరో ప్రాణాలు నిలిపాయన్నారు. రాష్ట్రంలోని యువతకు కేటీఆర్ ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నారని, నేటి యువత ఆయన బాటలో నడువాలని కోరారు.
పుట్టిన రోజున ఆర్భాటంతో వృథా ఖర్చు చేయకుండా సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తే బాగుంటుందన్నారు. కేటీఆర్ పుట్టిన రోజుకు ఒకరోజు ముందు కాలికి స్వల్పగాయం కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతోపాటు మహేశ్వరం నియోజకవర్గ ప్రజల తరఫున భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు.