షాబాద్, జూలై 24: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు చేవెళ్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కాలె యాదయ్య కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు. వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కేటీఆర్ పేరుపై అర్చన చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద జడ్పీటీసీ అవినాశ్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు.
మొయినాబాద్లో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సహకారంతో హైతాబాద్లో వెల్స్పన్ కంపెనీ, శంకర్పల్లి మండలం కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మీరమాణారెడ్డి, కోట్ల ప్రశాంతీమహేందర్రెడ్డి, ధర్మన్నగారి గోవర్ధన్రెడ్డి, గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీలు మర్పల్లి మాలతీకృష్ణారెడ్డి, గోవిందమ్మ గోపాల్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వప్నా నర్సింహారెడ్డి, శివనీల చింటు, బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు చల్లా శేఖర్రెడ్డి, శశిధర్రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, గూడూర్ నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా, పార్టీ సీనియర్ నాయకులు శేరిగూడెం వెంకటయ్య, జడల రాజేందర్గౌడ్, కల్వకోల్ వెంకట్, మధుసూదన్రెడ్డి, అరీఫ్, తొంట వెంకటయ్య, రాజేశ్వర్రెడ్డి, కుమ్మరి దర్శన్, వహీద్, వెంకట్రెడ్డి, రాజేందర్రెడ్డి, రాంచంద్రారెడ్డి, రమేశ్యాదవ్, ఇమ్రాన్, మునీర్, ముఖ్రంఖాన్, షబ్బీర్, చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, దేవుని ఎర్రవల్లి సర్పంచ్ మాణిక్య రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, సివిల్ సప్లయ్ జిల్లా సభ్యుడు రవి, టీఆర్ఎస్ మొయినాబాద్ నాయకులు కొంపల్లి అనంత్రెడ్డి, శ్రీహరియాదవ్, జయవంత్, నర్సింహారెడ్డి, కుమ్మెర ఈశ్వర్, మహేశ్యాదవ్, వెంకట్రెడ్డి, సుధాకర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ది ప్రముఖ పాత్ర
-ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కేక్ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. నవతరానికి ఆదర్శప్రాయుడని అన్నారు. కార్యక్రమంలో సురేందర్రెడ్డి, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో..
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్ : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గుడిసెల్లో నివాసముంటున్న వారికి గుడిసెల పైకప్పు కవర్లు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందజేశారు. మంచాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో టీఆర్ఎస్వీ నాయకుడు విజయ్కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు డిక్షనరీలు అందజేశారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వర్కాల పరమేశ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో కేక్ కట్ చేశారు. అబ్దుల్లాపూర్మెట్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ నాయకులు గోవర్ధనం ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు, ఎంపీటీసీ భరత్రెడ్డి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ కార్యదర్శి మైలారం విజయ్కుమార్, నాయకులు వీరేశ్, కొంకని విజయ్కుమార్, శ్రావణ్, అభిలాష్, నాని, సుజయ్, సోనీ, సాయికుమార్, శివకుమార్ ఉన్నారు.
ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఆమనగల్లు : రానుంతల గ్రామంలో సర్పంచ్ సోనాశ్రీనునాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. గ్రామంలోని 10 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఎంపీపీ అనిత సమకూర్చిన నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి, ఎంపీటీసీ సరిత, ఏఎంసీ డైరెక్టర్ సురమల్ల సుభాశ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : చుక్కాపూర్, వెంకటాపూర్, వెల్జాల్ తదితర గ్రామాల్లో మంత్రి జన్మదిన వేడుకలను నిర్వహించారు. మొక్కలు నాటి గ్రామంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రహమాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, నాయకులు శ్రీధర్రెడ్డి, శ్రీశైలంయాదవ్, లక్ష్మీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.