బహిరంగ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు
‘దేశ్కీ నేత’ అంటూ నినాదాలు
సీఎం కేసీఆర్కు జననీరాజనం
నెట్వర్క్, నమస్తే తెలంగాణ;ముఖ్యమంత్రి కేసీఆర్కు జన నీరాజనం పలికారు.. వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం పర్యటించారు.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడంతో ఒకప్పటి కరువు నేల అయిన పాలమూరు నేడు వజ్రపుతునకలా మారిందన్నారు.. వలసల ఖిల్లాగా ఉన్న చోటకే వేరే రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చి బతుకున్నారని చెప్పారు..ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువును తట్టుకోలేక అన్నదాతలు వలసలు వెళ్తుంటే విలపించిన కరువు నేల.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రూపురేఖలు మారిందో సీఎం కేసీఆర్ పాట పాడి వినిపించారు. స్వయంగా తానే రాసిన ఈ పాటనాటి పాలమూరు దుస్థితికి.. నేటి మార్పునకు అద్ధం పడుతున్నది.వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా..పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసి ..చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి..పాలమూరు తల్లి పచ్చని పైట కప్పుకొన్నది…
సీఎం పర్యటన సైడ్లైట్స్
మంగళవారం మధ్యాహ్నం 12:39 గంటలకు వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభం.
1:15 గంటలకు ‘మన ఊరు -మనబడి’ పైలాన్ ఆవిష్కరణ.
1:35 గంటలకు రాజపేట శివారులోని టీఆర్ఎస్ భవన్ ప్రారంభం.
2 గంటలకు వనపర్తి సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం. జిల్లా అధికారులతో సమీక్ష.
సాయంత్రం 4:48 గంటలకు వేరుశనగ వ్యవసాయ పరిశోధన కేంద్రం, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయం, కర్నెతండా ఎత్తిపోతల, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన.
4:58 నుంచి 5:24 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగం.