కొడంగల్, జూలై 10: 28 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. ఆదివారం స్థానిక మంజునాథ ఫంక్షన్ హాల్లో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 97 మంది విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయంగా పలుక రించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మధుసూదన్రావు, శీలా దేవి, బస్వలింగప్పలు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌర వా న్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గురు వులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థీ వివిధ వృత్తుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతు న్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అనంతరం గురువులను సన్మానించారు. కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయులు అనంతయ్యతో పాటు ఉపాధ్యాయులు బాల్రెడ్డి, పద్మమ్మలతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
పట్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు..
మర్పల్లి, జూలై 10: మండల పరిధిలోని పట్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87 లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివా రం సంగారెడ్డిలో కలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.