‘కార్పొరేట్కు దీటుగా సర్కార్ బడులు తీర్చిదిద్దబడుతున్నాయి.. మన ఊరు – మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి..’ అని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం షాద్నగర్ మండలం చేగూరు, నందిగామ, నర్సప్పగూడ పాఠశాలల్లో నిర్వహించిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో పాటు కొందుర్గు మండలం ముట్పూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన తెలుగు, ఆంగ్ల విద్యాబోధన అందుతున్నదన్నారు. గ్రామాల అభివృద్ధే తెలంగాణ సర్కార్ లక్ష్యమన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని తెలిపారు.
షాద్నగర్, జూలై 5: గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఎదుగుదలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభు త్వం సర్కారు బడులను బలోపేతం చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం నందిగామ మండలంలోని చేగూరు, నందిగామ, నర్సప్పగూడ గ్రామాల్లో జరిగిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గు మండలంలోని ముట్పురు గ్రామంలో రూ. 1.9 కోట్లతో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు, రైతువేదిక, వైకుంఠధామాల ప్రారంభోత్సవం అదేవిధంగా రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదికను ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రభు త్వం సర్కారు బడుల బలోపేతానికే మన ఊరు -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు సమకూరుతాయన్నారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలకు సర్కారు బడులకే పంపించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులే మంచి ర్యాంకులు, మార్కులు సాధిస్తున్నారని అందు కు నిదర్శనం పది, ఇంటర్ ఫలితాలేనని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామీణ ప్రాం తాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు.. మారుమూల గ్రామాలకు కూడా బీటీ రోడ్లు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు.
అనంతరం మంత్రి సబితారెడ్డిని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీలు శ్రీలత, విశాల, ఎంపీపీలు రవీందర్యాదవ్, ప్రియాంకాగౌడ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచ్లు సంతోష, గోవిందు అశోక్, జట్టకుమార్, రమేశ్, స్వామి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి, మాజీ ఎం పీపీ శివశంకర్గౌడ్, నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మంజుల, అశోక్, విఠల్, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కుమార్గౌడ్, కళమ్మ, రాజ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజేశ్ పటేల్, రామకృష్ణారెడ్డి, సత్యనారాయణ, దేవేందర్, శ్రీధర్రెడ్డి, పాండు, శ్రవణ్, రా జు, శ్రీశైలం, కుమార్, నర్సింహ, సుదర్శన్గౌడ్, యాదయ్య, కుమార్గౌడ్, రవి, భాస్కర్, ఆంజనేయులు, శరత్, శ్రీపాల్రెడ్డి, సాయి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాల, గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి
నందిగామ, జూలై 5: నూతనంగా ఏర్పడిన నందిగామ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవిలకు మంగళవారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నందిగామ సర్పంచ్ వెంకట్రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇదివరకే నూతన మండల కేంద్రాల్లో ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్ అసెంబ్లీలోనూ ప్రస్తావించారని… ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కళాశాల, గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
టీఆర్ఎస్లో కాంగ్రెస్ నాయకుల చేరిక
నందిగామ మండలంలోని నర్సప్పగూడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ గోవిందు అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు సిద్ధయ్య, రమేశ్, మల్లేశ్, రమేశ్, శ్రీశైలం, రవి, రామచంద్రయ్య, జగన్, సాయి, వెంకటేశ్, శివలింగం, చింటు, రవి తదితరున్నారు.