పరిగి, జూలై 5: వర్షపు నీరు వృథా పోకుండా ఒడిసి పట్టేందుకు గ్రామాల్లో చెరువులు, కుంటల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీని ద్వారా ఎక్కడికక్కడే చెరువులు, కుంటలను నిర్మించి నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెం దనున్నాయి. అలాగే ఈ పనులను చేపట్టడం ద్వా రా ఉపాధిహామీ కూలీలకు కూడా చేతినిండా పని దొరుకుతుంది. వికారాబాద్ జిల్లాలో ఉపాధిహామీ పథకం ద్వారా 87 చెరువులు, కుంటల నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అందులో ఉపాధి హామీ కింద 19 కొత్త చెరువులు, కుంటల నిర్మాణంతోపాటు వాటర్షెడ్ ద్వారా ఏడు చెరువుల నిర్మాణానికి నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయి. కాగా 61 పాత వాటిని కూడా పునరుద్ధరిస్తున్నారు. వేసవిలో కొన్ని చెరువులు, కుంట ల పనులు పూర్తి కాగా, ప్రస్తుతం 58 చెరువులు, కుంటల నిర్మాణం, పునరుద్ధరణ పనులు శరవేగం గా సాగుతున్నాయి. వీటిని ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు.
పూర్తి కావస్తున్న పనులు..
జిల్లాలో 87 చెరువులు, కుంటల నిర్మాణంతోపాటు పునరుద్ధరణ పనులు ప్రారంభమైన వాటిలో చాలావరకు తుది దశకు చేరాయి. ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 2,00,069 జాబ్కార్డులు ఉన్నాయి. వేసవి లో ఉపాధి పనులు ముమ్మరం గా కొనసాగగా ప్రస్తుతం జిల్లాలో చెరువులు, కుంటల నిర్మాణం, పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
వచ్చే నెల 15లోపు పూర్తికి చర్యలు
జిల్లా పరిధిలో ఉపాధిహామీ ద్వారా 80, వాటర్షెడ్ ద్వారా 7 చెరువులు, కుంటల నిర్మాణం, పునరుద్ధరణ పనులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 58 చెరువుల పనులు కొనసాగుతుండగా.. ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తి చేసేలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఉపాధిహామీ కూలీలకు పనిని కల్పించడంతోపాటు కుంటల పునరుద్ధరణ ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయాలనే లక్ష్యంతో ఈ పనులను చేపట్టడం జరిగింది.
-కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా
ప్రతి మండలంలో 3 నుంచి 5 చెరువులు..
జిల్లాలో 19 మండలాలుండగా.. అందులో ఒక్కో మండలంలో 3 నుంచి 5 చెరువులు, కుంటల నిర్మాణంతోపాటు పునరుద్ధరించే పనులను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట రెవె న్యూ, లేనిచోట అటవీశాఖ అధికారులు, ఉపాధిహామీ ఉద్యోగులు, స్థానిక సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించి స్థలాలను గుర్తించారు.
బం ట్వారం మండలంలోని రొంపల్లి, నంద్యానాయక్తండా, గొటిగ్కలాన్, కడ్గిర, బొజ్యానాయక్తండా, బొంరాస్పేట మండలంలోని అలిఖాన్పల్లి, దుద్యాల్, చొవర్పల్లి, రేగడిమైలారం, బొట్వానితండా, ధారూర్ మండలంలోని గడ్డమీదగంగారం, అల్లీపూర్, నాగసముందర్, అల్లాపూర్, దోమ మండలంలోని ఊట్పల్లి, బాస్పల్లి, గొడుగోనిపల్లి, మోత్కూర్, రాకొండ, దౌల్తాబాద్ మండలంలోని బిచాల్, దేవర్ఫస్లాబాద్, గుముడాల్, ఇమ్డాపూర్, కుదురుమల్ల, కొడంగల్ మండలంలోని పెద్దనందిగామ, అప్పాయిపల్లి, పర్సాపూర్, కోట్పల్లి మండలంలోని బీరోల్, మోత్కుపల్లి, కులకచర్ల మండలంలోని ముజాహిద్పూర్, దాస్యానాయక్తండా, లింగంపల్లి, పటేల్చెరువుతండా, మర్పల్లి మండలంలోని బుచన్పల్లి, కోట్మర్పల్లి, దర్గులపల్లి, దామస్తాపూర్,
మోమిన్పేట మండలంలోని మొరంగపల్లి, చంద్రాయన్పల్లి, మోమిన్పేట, గోవిందాపూర్, ఎన్కతల, నవాబుపేట మండలంలోని ఎన్కతల, ఎక్మామిడి, మాదారం, గేట్వనంపల్లి, పరిగి మండలంలోని రూప్సింగ్తండా, ఇబ్రహీంపూర్, బసిరెడ్డిపల్లి, నజీరాబాద్, మిట్టకోడూరు, పెద్దేముల్ మండలంలోని మదంత్పూర్, ఇందూర్, అతుకూర్, గోపాల్పూర్, గొట్లపల్లి, పూడూరు మండలంలోని కండ్లపల్లి, తిర్మలాపూర్, దేవనోనిగూడ, సోమన్గుర్తి, నిజాంపేట, మేడిపల్లి, తాండూరు మండలంలోని బిజ్వార్, అంతారం, కోట్బాస్పల్లి, అంతారంతండా, వికారాబాద్ మండలంలోని జైదుపల్లి, గోధుమగూడ, పులుమామిడి, యాలాల మండలంలోని యాలాల, భానాపూర్, అక్కంపల్లి, సంగాయిపల్లి, అన్నసాగర్ గ్రామపంచాయతీల పరిధిలో కొత్త చెరువుల నిర్మాణంతోపాటు పాత కుంటలను పునరుద్ధరించనున్నారు. సంబంధిత మండలాల్లో కొత్త చెరువులు, కుంటల నిర్మాణానికి స్థలాలు లేకపోతే కుంటలను పునరుద్ధరిస్తారు. కొత్త చెరువులు, కుంటల నిర్మాణంతో జిల్లాలో 8 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిలువ సామర్థ్యం పెంపే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.
ఈ పనులను ఉపాధిహామీ కూలీలతో చేపట్టనున్నారు. ఒక్కో చెరువు, కుంట పనులకు సంబంధించి మూడు మీటర్ల లోతు వరకు మట్టిని తీయడంతోపాటు రిబిట్మెంట్, కట్ట నిర్మాణం, తూము పనులను చేపట్టనున్నారు. కొత్త చెరువుల్లో పది వేల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉండాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో చెరువులో పని చేసేందుకు కూలీలకు 2,500 నుంచి 3,500 వరకు పనిదినాలను కల్పించను న్నారు. కొత్తగా నిర్మిస్తున్న చెరువులను ఎకరం విస్తీర్ణంలో చేపడుతున్నారు.