ధారూరు, జూలై 5: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో గ్రామాలు తోరణాల్లా మారుతున్నాయి. మొక్కలను గ్రామా ల్లోని రోడ్లకు ఇరువైపులా, పాఠశాలలు, దేవాలయాల ఆవరణలో, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, పొలాల గట్లపైనా విరివిగా నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని నర్సరీల్లో వచ్చే హరితహారం నాటికి అవసరం మేర నాటేందుకు మొక్కలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది నర్సరీల్లో పూలు, పండ్ల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
మండల పరిధిలో ఎనిమిది ఉన్నత పాఠశాలలుండగా అవి నాగారం, ధారూరు, మోమిన్కలాన్, తరిగోపుల, నాగసముందర్, కెరెళ్లి, కుక్కింద గ్రామాల్లో ఉన్నాయి. కాగా మోమిన్కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నాలుగేండ్లుగా ప్రతి ఏటా హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో అన్ని రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పాఠశాలలో దాదా పుగా 1200 మొక్కలను నాటి.. వేసవిలో అవి ఎండిపోకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు నీటిని అందించి కాపాడుతున్నారు. పాఠశాలలో ఆరుగురు ఉపా ధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు, అటెండర్ ఉండగా… ఆరు నుంచి పదో తరగతి వరకు సుమారుగా 130 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో మొక్కలకు నీటిని అందిస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సహంతో పాఠశాల ప్రాంగణం హరితశోభను సంతరించుకున్నది.
మొక్కలను నాటి సంరక్షిస్తున్నాం
హరితహారం కార్యక్రమంలో భాగంగా మోమిన్కలాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని రకాల మొక్కలను నాటి సంరక్షిస్తున్నాం. నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఫలాలను ఇస్తున్నాయి. పాఠశాల ప్రాంగణం పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. ఇప్పటివరకు దాదాపుగా 1200 మొక్కలను నాటి కాపాడుతున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిరోజూ మొక్కలను సంరక్షిస్తున్నారు. ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాఠశాల ప్రాంగణమంతా ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. -బాబుసింగ్, ఎంఈవో, ధారూరు మండలం