రంగారెడ్డి జిల్లాలో జోరుగా భూ క్రయవిక్రయాలు సాగుతున్నాయి. దీంతో జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లశాఖకు నెలనెలా భారీగా ఆదాయం సమకూరుతున్నది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లతో మే నెలతో పోల్చితే జూన్లో రూ.25 కోట్లు అధికంగా రెవెన్యూ సమకూరింది. మేలో రూ.325.94 కోట్లు రాగా, జూన్లో ఏకంగా రూ.349.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రూ.84.49 కోట్లు సమకూరగా, అత్యల్పంగా కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కేవలం రూ.14.69 లక్షల ఆదాయం వచ్చింది. జూన్లో వ్యవసాయేతర భూములకు సంబంధించి 21,449 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది.
రంగారెడ్డి, జులై 4, (నమస్తే తెలంగాణ) : వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లతో జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా రెవెన్యూ సమకూరింది. గతేడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం జూన్లో రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా రాబడి వచ్చింది. మే నెలలో రూ.325.94 కోట్లు, జూన్లో రూ.349.10 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ నెలలో రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా సమకూరగా, అత్యల్పంగా కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా సమకూరింది. మరోవైపు జూన్ నెలలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలకు సంబంధించి 21,449 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, శంషాబాద్, యాచారం, శంకర్పల్లి మండలాల్లో రియల్ వ్యాపారం జోరందుకుంది. ముఖ్యంగా 111 జీవో పరిధిలోని మండలాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు గత రెండు, మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. దీంతో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లతో ఆదాయం పెరిగింది.
జూన్లో రూ.349.10 కోట్ల ఆదాయం
జూన్ నెలలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లతో రూ.349.10కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.
ఎస్ఆర్వో ఆదాయం : (రూ.కోట్లు)
రంగారెడ్డి : 89.49 (ఆర్వో)
గండిపేట : 51.9
శేరిలింగంపల్లి : 30.85
వనస్థలిపురం : 9.03
మహేశ్వరం : 17.58
రాజేంద్రనగర్ : 21.14
చంపాపేట్ : 11.21
ఎల్బీనగర్ : 18.61
శంషాబాద్ : 6.60
చేవెళ్ల : 14.95
ఇబ్రహీంపట్నం : 6.51
సరూర్నగర్ : 9.17
శంషాబాద్ : 6.60
ఫరూఖ్నగర్ : 6.51
శంకర్పల్లి : 28.40
హయత్నగర్ : 5.60
షాద్నగర్ : 8.30
పెద్దఅంబర్పేట్ : 4.69
అబ్దుల్లాపూర్మెట్ : 3.76
వికారాబాద్ : 2.37
తాండూరు : 1.55
పరిగి : .58
కొడంగల్ : .14