ఇబ్రహీంపట్నం, జూలై 4 : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డికొమురయ్య 76వ వర్ధంతిని సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కుర్మసంఘంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇబ్రహీంపట్నం అమరవీరుల స్థూపం వద్ద కొమురయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుర్మసంఘం రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. సాయుధ పోరాటంలో రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మాజీ జడ్పీటీసీ ఐలయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ క్యామ శంకర్, కుర్మ సంఘం నాయకులు పొట్టి రాములు, జంగయ్య, పాశ్చ భాష, పాల్గొన్నారు.
కడ్తాల్ : మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సోమవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని చండీశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు యాదయ్య, అంజయ్య, రమేశ్ పాల్గొన్నారు.
మంచాల : ఆరుట్ల లో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, ఉపసర్పంచ్ జంగ య్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల కేంద్రంలో గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో ఆయ న చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జీఎంపీఎస్ మండల అధ్యక్షుడు పెంటయ్య, సభ్యులు తిరుపతి, శివశంకర్, మల్లేశ్, కురుమయ్య, రామచంద్రి, నరసింహ, మహేశ్ పాల్గొన్నారు.
నందిగామ : వెంకమ్మగూడ గ్రామంలో చేగూరు పీఏసీఎస్ చైర్మన్ గోర్లపల్లి అశోక్ ఆధ్వర్యంలో కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో గుండల శ్రీనివాస్, కుమ్మరి దేవప్ప, శ్రీను, రాజు, శంకర్, కృష్ణ, రాజు, ప్రవీణ్, రమేశ్ పాల్గొన్నారు.