యాలాల, జూలై 2 : పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయనిధి తోడ్పడుతున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన మహేశ్కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్లో చికిత్స పొందగా..మంజూరైన రూ.లక్ష విలువైన ఎల్వోసీని హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా ఆత్మీయ భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఆపత్కాలంలో ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు కార్పొరేట్ వైద్యంతో స్వస్థత పొందేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి పథకం ఎంతో తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి పాల్గొన్నారు.