రంగారెడ్డి, జూలై 2 (నమస్తే తెలంగాణ): రైతులకు పంట రుణాలను సహకార బ్యాంకులు లక్ష్యానికి మించి మంజూరు చేస్తున్నాయి. అర్హులైన రైతులందరికీ పంట రుణాలను మంజూరు చేస్తూ సహకారం అందిస్తున్నాయి. గత నాలుగేండ్లుగా నిర్దేశించిన లక్ష్యానికి మించి .. ప్రతి ఏడాది దాదాపుగా 80 వేల మంది రైతులకు పంట రుణాలను సహకార బ్యాం కులు మంజూరు చేస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకే కాకుండా ఆ బ్యాంకు పరిధిలోని 34శాఖల్లోనూ ప్రతి ఏడాది లక్ష్యానికి మించి రైతులకు రుణాలు అందుతున్నాయి. ఈ వానకాలానికి సంబంధించి హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని 34 బ్రాంచీల్లో రూ. 200 కోట్ల పంట రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
గత నాలుగేండ్లుగా 115 శాతం నుంచి 150 శాతం మేర పంట రుణాలను మంజూరు చేస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం రూ.218 కోట్లు కాగా రూ.320 కోట్ల నిధులు మంజూరు, 2018-19లో లక్ష్యం రూ.272 కోట్లుకాగా రూ. 374 కోట్లు, 2019-20లో లక్ష్యం రూ.390 కోట్లుకాగా రూ.432 కోట్లు, 2020-21లో లక్ష్యం రూ. 220 కోట్లుకాగా రూ.300 కోట్ల మేర రుణాలను మంజూరు చేశారు. అయితే రైతుబంధు పథకంతో రైతులు సహకార బ్యాంకులు మినహా ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
‘రైతుబంధు’తో తప్పిన అప్పుల తిప్పలు
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం తో రైతులకు అప్పుల తిప్పలు తొలిగిపోయాయి. ప్రభుత్వం ప్రతిఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పు న పెట్టుబడి సాయాన్ని అందిస్తుండటంతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి తప్పిం ది. గత నాలుగేండ్లుగా జిల్లాలో పంట రుణాలకు సంబంధించి వానకాలం, యాసంగి సీజన్లకుగానూ నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 35 శాతం మాత్రమే రుణాలు మంజూరు అవుతుండటం గమనార్హం. గతంలో ప్రతి ఏటా నిర్దేశించిన లక్ష్యంలో 75 శాతం మేర రుణాలను మంజూరు చేసినప్పటికీ, అందరికీ రుణాలు అందలేదనే ఫిర్యాదులతో జిల్లా ఉన్నతాధికారులు బ్యాంకర్లపై వంద శాతం రుణాలను మం జూరు చేసేలా ఒత్తిడి తెచ్చిన పరిస్థితులుండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలతో రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీనిచ్చిన దృష్ట్యా రుణాలను రెన్యువల్స్ చేసుకునే రైతులు తప్పా కొత్త రుణాలను రైతులు తీసుకోవడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
అయి తే ‘రైతుబంధు’ కింద ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,556 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది. 2018 వానకాల సీజన్లో 2,47,688 మంది రైతులకుగాను రూ. 257 కోట్లు, యాసంగిలో 2,21,096 మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలంలో 2,30,155 మంది రైతులకుగాను రూ.257 కోట్లు, యాసంగిలో 1,87,804 మంది రైతులకుగాను రూ.182 కోట్ల పెట్టుబడి సహాయాన్ని, 2020 వానకాలంలో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344 కోట్ల పెట్టుబడిని, 2021 వానకాలంలో 2,82,094 మంది రైతులకుగాను రూ.343 కోట్ల ఆర్థిక సహాయాన్ని, యాసంగిలో 345.33 కోట్ల పెట్టుబడి సాయాన్ని, 2022 వానకాలానికి సంబంధించి ఇప్పటివరకు 2,79,070 మంది రైతులకుగాను రూ.246 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
అర్హులందరికీ పంట రుణాలు
హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంకుతోపాటు అన్ని శాఖల్లోనూ అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలను అందిస్తున్నాం. ప్రతి ఏటా అన్ని బ్రాంచీల్లో లక్ష్యానికి మించి రుణాల ను రైతులకు మంజూరు చేస్తున్నాం. ఈ వానకాలానికి సంబంధించి రైతులకు పంట రుణాలను అందిస్తున్నాం.
– మనోహర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్