పరిగి, జూన్ 27: రేషన్ సరుకుల పంపిణీలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి సర్కారు చర్యలు చేపట్టింది. 4జీ ఈ-పాస్ యంత్రాల వినియోగంతో పేదలకు సరుకులను అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ-పాస్ యంత్రాలను వికారాబాద్ జిల్లా కు తెప్పించింది. కాగా జిల్లాలో 588 రేషన్ దుకాణాలున్నాయి. ప్రతినెలా ఈ-పాస్ యంత్రాలతో పేదలకు సరుకులు అందించనున్నారు. వీటి ద్వారా సరుకుల పంపిణీలో ఇబ్బందులు తొలగనున్నాయి.
కార్డుదారులు 2,41,595 మంది
వికారాబాద్ జిల్లాలో 588 రేషన్ షాపులుండగా.. 2,41,595 కార్డుదారులున్నారు. వాటిలో ఆహార భద్రతాకార్డులు 2,14,624, అంత్యోదయ 26, 933, అన్నపూర్ణ కార్డులు 38 ఉన్నాయి. ఇందులో ఆహారభద్రతా కార్డుల్లో పేరున్న ప్రతి ఒక్కరికీ ప్రతినెలా 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తారు. ఈ లెక్కన జిల్లాలో 7492.220 మెట్రిక్ టన్నులు, అం త్యోదయ కార్డులకు 1311.305 మెట్రిక్ టన్నులు, అన్నపూర్ణ కార్డులకు 0.590 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు పంపిణీ చేస్తున్నది. అంత్యోదయ కార్డులు ఉన్న వారికి ఒక్కో కార్డుపై కిలో చక్కెరను కూడా అందిస్తున్నారు. ప్రతినెలా 1-15వ తేదీ వరకు సరుకులను రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్నారు.
4జీ యంత్రాలతో వేగంగా సరుకుల పంపిణీ
పేదలకు రేషన్ సరుకులను 4జీ ఈ-పాస్ యం త్రాలతో అందించాలని సర్కారు నిర్ణయించింది. అందుకు అనుగుణంగా డీలర్లకు ఆ యంత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కొత్త యంత్రాలు ఈనెల 30వ తేదీ లోపు జిల్లాకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చిన వెంటనే వాటిని ఆయా మండలాల వారీగా పంపిణీ చేసి, అక్కడి నుంచి గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు తరలిస్తారు. తద్వారా జూలైలో రేషన్ సరుకులను కొత్త ఈ-పాస్ యంత్రాలతోనే అం దించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి యంత్రాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పలుసార్లు సమస్యలు తలెత్తుతున్నాయి. వైఫై సిగ్నల్స్ సైతం సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సరుకుల పంపిణీలో ఇబ్బందులు కలుగుతున్నాయి. కొత్తగా వచ్చే 4జీ ఈ-పాస్ యంత్రాల తో థంబ్, ఐరిష్ అత్యంత వేగంగా జరుగుతుందని పేర్కొంటున్నారు.
కొత్త యంత్రాలతో గ్రామాల్లో రేషన్ సరుకులు పొందే వారి ఇబ్బందులు తీరనున్నాయి. గతంలో సిగ్నల్స్ లేవంటే కార్డుదారులు మళ్లీ రేషన్ షాపునకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి వాటన్నింటికి చెక్ పడనున్నది. షాపులు కాస్త దూరంలో ఉంటే రవాణా చార్జీలు వృథా అయ్యేవి. 4జీ ఈ-పాస్ యంత్రాలతో రేషన్ సరుకుల పంపిణీ మరిం త వేగవంతం, సరళతరం కానున్నది.
వచ్చే నెల నుంచే కొత్త యంత్రాలతో పంపిణీ
వచ్చే నెల నుంచే కొత్త ఈ-పాస్ యంత్రాలతో పేదల కు రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నాం. ఈ కొత్త యంత్రాలు రెండు, మూడు రోజుల్లో జిల్లాకు రానున్నాయి. వచ్చిన వెంటనే అన్ని గ్రామాల్లోని రేషన్ డీలర్లకు పంపిణీ చేస్తాం. జిల్లాలో 588 రేషన్ దుకాణాలుండగా 2,41,595 రేషన్ కార్డులపై సరుకుల పంపిణీ జరుగుతున్నది.
-రాజేశ్వర్రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి