పరిగి, జూన్ 27: సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ పేర్కొన్నారు. సోమవారం పరిగి మండలం మాదారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశం లో సర్పంచ్ రాములు, నాయకులు మహేందర్ బ్యాగులు, సాయిరాం నోటు పుస్తకాలను ఎంపీపీ, జడ్పీటీసీ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దడానికి మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అన్ని వసతుల కల్పనతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభమైందన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా చక్కటి విద్యాబోధన అందుతుందని, ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీనియర్ నాయకులు బి.ప్రవీణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ విద్యారంగం అభివృద్దికి సర్కారు చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంక టేశం, మొగులయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
కొడంగల్, జూన్ 27: ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తున్నదని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా సరఫరా అయిన పాఠ్యపు స్తకాలను అధ్యాపకులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభం అయ్యాయని విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని సూచించారు.