ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 27 : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్రీడాప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు పెండింగ్లో ఉన్న గ్రామాలకు రెవెన్యూ అధికారులు గుర్తించి వెంటనే స్థలాలు కేటాయించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం ప్రతి మండలానికి 5 బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు ఆదేశించినందున వెంటనే ప్రకృతి వనాలతో పాటు ఇంకా మిగిలిపోయిన గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో క్రాంతికిరణ్, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంపీవో లక్పతినాయక్తో పాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
మన ఊరు మనబడితో కొత్తశోభ
మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడులకు నూతన శోభ సంతరించుకుంటుందని ఎంపీపీ కృపేశ్ అన్నారు. దండుమైలారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.40 లక్షలతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లీశ్వరి, ఎంపీటీసీలు అనసూయ, అరుణమ్మ, సహకార సంఘం చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీడీవో క్రాంతికిరణ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.