తుర్కయాంజాల్, జూన్ 27: తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్ రెవెన్యూ సర్వేనంబర్ 383/1లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో భూములను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం కుటుంబానికి 300 గజాల చొప్పున స్థలాన్ని కేటాయిస్తూ ఆదుకున్నది. సోమవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఆర్డీవో వెంకటాచారి సమక్షంలో లాట రీ పద్ధతి ద్వారా ప్లాట్ నంబర్ను కేటాయించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గతంలో రాజీవ్ స్వగృహ కోసం ప్రభుత్వం తొర్రూర్ రైతుల నుంచి భూమిని సేకరించిందని తెలిపారు.
అయితే రాజీవ్ స్వగృహ వారు రైతుల నుంచి తీసుకున్న భూమిని నిరుపయోగంగా ఉంచడంతో ప్రభుత్వం ఆ భూమి ని తీసుకుని హెచ్ఎండీఏ ద్వారా అభివృద్ధి చేస్తూ భూములు కోల్పోయిన రైతులకు 300 గజాల చొ ప్పున స్థలాన్ని కేటాయించినట్లు ఆయన తెలిపారు. 97 మంది లబ్ధిదారులుండగా 15 మంది పేర్లు రెం డోసారి కూడా రావడంతో 82 మందికి లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ నంబర్ను ఇచ్చినట్లు, త్వరలోనే వారికి పట్టాలను కూడా అందిస్తామన్నారు. మిగిలిన 15 ప్లాట్లపై విచారణ జరిపి వాటిని కూడా లబ్ధిదారులకే కేటాయిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి తమకు ప్లాట్ను కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతోనే న్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ అని త, ఆర్ఐ భిక్షపతి, వీఆర్వోలు,సిబ్బంది పాల్గొన్నారు.