షాద్నగర్టౌన్, జూన్ 22: అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని 3,11,19వ వార్డుల్లో కమ్యూనిటీహాల్ నిర్మాణాలకు బుధవారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అదే విధంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఇటీవలే నిర్వహించిన పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలోని అన్ని వార్డులు మరింత సుందరంగా మారాయన్నారు. ప్రజల సంక్షేమం కోసమే మున్సిపాలిటీలోని వార్డుల్లో నూతన కమ్యూనిటీ భవనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వార్డుల్లో నిర్మించే కమ్యూనిటీహాల్ భవనాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కమ్యూనిటీహాల్ ఒక్కొక్క భవన నిర్మాణానికి సీడీపీ నిధుల ద్వారా రూ. 25 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, కౌన్సిలర్లు ఆరీఫాబేగం, వెంకట్రాంరెడ్డి, సర్వర్పాషా, శ్రీనివాస్, నర్సింహ, శ్రీనివాస్, అంతయ్య, శారద, నాయకులు జూపల్లి శంకర్, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం
నిరుపేద ప్రజలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని అడ్వకేట్ కాలనీకి చెందిన సయ్యద్ జాఫర్కు రూ. లక్ష, చటాన్పల్లి చెందిన మేఘమ్మకు రూ. 60 వేలు, రాంనగర్కాలనీ చెందిన రవీందర్కు రూ. 60 వేలు, కసాబ్వాడకు చెందిన యాదిలాల్కు రూ. 20వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ ఆరీఫాబేగం, శ్రీనివాస్, నాయకులు జూపల్లి శంకర్, పాండురంగారెడ్డి, పాపయ్య, శ్రీనివాస్, జమృత్ఖాన్, గౌస్జానీ పాల్గొన్నారు.
దళిత బంధుతో దళితులకు ఉపాధి
నందిగామ : దళితబంధు పథకంతో దళితులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన తడకల రమేశ్కు దళిత బంధు పథకం ద్వారా వచ్చిన వాహనాన్ని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు కట్న లత, కో ఆప్షన్ సభ్యులు బేగ్, సర్పంచ్ గోవిందు అశోక్, ఉపసర్పంచ్ కుమార్గౌడ్ పాల్గొన్నారు.