కడ్తాల్, జూన్ 22 : ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి సాధిస్తాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వారి ఆధ్వర్యంలో బుధవారం వరంగల్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, అసిఫాబాద్ జిల్లాలకు చెందిన ఆదర్శ గ్రామపంచాయతీల సర్పంచ్లు, మహిళా సమాఖ్య సభ్యులు రాష్ట్ర కోఆర్డినేటర్ ఉపేందర్ ఆధ్వర్యంలో కడ్తాల్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన వైకుంఠధామం, రైతు వేదిక, పల్లెప్రగతి వనం, డంపింగ్యార్డు, చెరువుల సుందరీకరణ, పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామంలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించిన సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డిని అభినందించారు. గ్రామంలో ప్రతి రోజూ సేకరిస్తున్న తడి-పొడి చెత్త వివరాలు, గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాలను సర్పంచ్లు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలన్నీ అభివృద్ధి సాధించాయని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ గ్రామాలకు అత్యధిక నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ప్రజల ప్రోత్సాహంతో రూపొందించిన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికతో పనులు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర కోఆర్డినేటర్ ఉపేందర్ మాట్లాడుతూ.. గ్రామాలను అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కమిటీలతో పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాంఖేడ్ ఎంపీపీ విమల, ఉపసర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు దీపికారెడ్డి, మహేశ్, మల్లయ్య, గణేశ్గౌడ్, వెంకటయ్యగౌడ్, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి, సర్పంచ్లు నిర్మల, మాధవి, ప్రేమలత, పద్మ, స్వరూప, రజిత, సులోచన, సుగుణ, కృష్ణవేణి ఉన్నారు.