బొంరాస్పేట, జనవరి 20 : కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజన తం డాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. తండాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు తన పుట్టిన రోజైన గురువారం ఆయన మన తండా-మన ఎమ్మెల్యే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని బుర్రి తండా పంచాయతీ పరిధి లోని మైసమ్మగడ్డతండాలో పర్యటించి తండా సమస్యలను తెలుసుకు న్నారు. గిరిజన మహిళలు పాటలు పాడుతూ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాల్లో గిరిజనులకు పాలానాధికారం కల్పించి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 500 జనాభా ఉన్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేశారని, నియోజకవర్గంలో 46 తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయన్నారు. అన్ని తండాల్లో ప్రజలకు మంచినీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాల్వల నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. తండాలు పంచాయతీలుగా ఏర్పడిన తరువాత వాటికి ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల రైతులకు వ్యవసాయంపై నమ్మకం పెరిగిందని, బతకడానికి పట్టణాలు, నగరాలకు వలస వెళ్లినవారు ఇప్పుడు గ్రామాలకు తిరిగి వస్తున్నారని, వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతులు అప్పుల నుంచి బయటపడుతున్నారని పేర్కొన్నారు. జాతీయ రహదారి నుంచి మైసమ్మగడ్డతండాకు బీటీ రోడ్డు, తండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు, గుడేల్కుచ్చతండాకు రూ.5 లక్షలతో రోడ్డు, భోజన్న గడ్డతండా, మెట్లకుంట గ్రామాలకు రోడ్డు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు చాంద్పాషా, పార్టీ నాయకులు దేశ్యానాయక్, మధుయాదవ్, రమణారెడ్డి, బండ శీను, రవిగౌడ్ పాల్గొన్నారు.