కడ్తాల్, జూన్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాము లు కావాలని రంగారెడ్డి జడ్పీ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. సోమవారం ఆయన మండల కేం ద్రంతోపాటు గాన్గుమార్లతండా గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న పల్లెప్రగతి పనులను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గాన్గుమార్లతండాలో చేపట్టిన పారిశుధ్య పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్ హంశ్యామోత్యానాయక్ను అభినందించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ ‘పల్లెప్రగతి’లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు.
‘మన ఊరు-మన బడి’ కింద ఎం పికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. మండల కేంద్రంలోని ఉప్పారాశికుంటను సుం దరీకరించాలని జడ్పీ సీఈవోకు జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయ క్, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు జహంగీర్బాబా, డీటీ రాజశేఖర్రెడ్డి, ఏంపీవో మధుసూదనాచారి, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, పీఏసీ ఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, హెచ్ఎం జంగయ్య, నాయకులు రాంచంద్రయ్య, నాగార్జున్, పాం డూనాయక్, జగన్నాయక్, భీక్యానాయక్, పం చాయతీ కార్యదర్శులు రామచంద్రారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.