షాద్నగర్టౌన్, మే 31: షాద్నగర్ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో మున్సిపాలిటీ ఆదర్శంగా మారడం ఖాయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లతో కలిసి మంగళవారం రాత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో మున్సిపాలిటీ ఎంతో సుందరంగా మారిందన్నారు. ప్రతి వార్డులో సీసీరోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, వీధి దీపాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 9వ వార్డులో కల్వర్టు ఏర్పాటుకు, 26వ వార్డులో వరద కాలువ ఏర్పాటుకు, 17వ వార్డులో అంతర్గత మురుగుకాలువ, 18వ వార్డులో అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన, 25 వ వార్డులో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, కౌన్సిలర్లు ప్రతాప్రెడ్డి, సర్వర్పాషా, ప్రేమలత, నాయకులు జూపల్లి శంకర్, నర్సింహులు, యాదగిరి, యుగేందర్, శ్రీను పాల్గొన్నారు.
విద్యారంగ అభివృద్ధికి కృషి
కొందుర్గు : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మండలంలోని చేగిరెడ్డి ఘనాపూర్ పాఠశాలకు రూ. 14.59 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. చౌదరిగూడ ప్రాథమిక పాఠశాలకు రూ.4.58 లక్షలు, చౌదరిగూడ ఉర్దూమీడియం పాఠశాలకు రూ. 2.07 లక్షలు, ఎదిర ప్రాథమిక పాఠశాలకు రూ.14.55 లక్షలు.
ప్రాథమిక పాఠశాలకు రూ.15.57 లక్షలు, ప్రాథమిక పాఠశాల ఇంద్రానగర్కు రూ.2.75 లక్షలు, పెద్ద ఎల్కిచర్ల ప్రాథమిక పాఠశాలకు రూ.3.82 లక్షలు, వనంపల్లి పాఠశాలకు రూ.8.36 లక్షలు, రావిర్యాల పాఠశాలకు రూ. 4.87 లక్షలు, తుమ్మలపల్లి పాఠశాలకు రూ.3.58 లక్షలు, చౌదరిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.22.38 లక్షలు, పెద్ద ఎల్కిచర్ల ఉన్నత పాఠశాలకు రూ. 19.67లక్షలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం గుంజల్పహాడ్ గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్బాబు, ఎంపీవో విజయ్కుమార్పాల్, ఎంఈవో కిష్టారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్ పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు ఆందోళన చెందొద్దు
గ్రామాల్లోని అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుందని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రజాప్రతినిధులకు సూచించారు. కొందుర్గు మండల కేంద్రంలో ఎంపీపీ జంగయ్య అధ్యక్షతన సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో చేపడుతున్న ప్రతి పనికి ప్రజా ప్రతినిధులకు గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, జడ్పీటీసీ రాగమ్మ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.