ఇబ్రహీంపట్నం, మే 25 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. జ్ఞానసరస్వతి ఫౌండేషన్, హనుమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. నియోజకవర్గంలో హ నుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో హమమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో బుధవారం రాత్రి యువకులు భారీ బైక్ర్యాలీ నిర్వహించారు.
వివిధ గ్రామాల్లో
మంచాల : వివిధ గ్రామాల్లో హనుమాన్ జయంతిని నిర్వహించారు. అస్మత్పూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం చాంద్ఖాన్ గూడలో దేవాలయ ఆవరణలో హోమం, పూజలు నిర్వహించారు. చాంద్ఖాన్ గూడలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయం వద్ద సర్పంచ్ నౌసుహరిప్రసాద్, ఉప సర్పంచ్ రాధిక గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో..
కడ్తాల్ : మండల వ్యాప్తంగా హన్మాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యుడు నరేందర్రెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, వెంకటేశ్, పెంటారెడ్డి, అశోక్రెడ్డి, మల్లేశ్, రవి పాల్గొన్నారు.
వీరాంజనేయస్వామి ఆలయంలో పూజలు
షాద్నగర్టౌన్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని షాద్నగర్ మున్సిపాలిటీలోని హాజిపల్లి రోడ్డు విజయనగర్కాలనీ శ్రీ భవానీ సహస్ర లింగేశ్వర వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు శంకర్రెడ్డి, వెంకట్రెడ్డి తెలిపారు. దేవాలయంలో ఉదయం నుంచి విశేష పూజా కార్యక్రమాలతో పాటు హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటకృష్ణ, బాలగోపాల్, జనార్ధన్, సోమేశ్, రవీందర్, వెంకట్రెడ్డి, కిరణ్, రాము, సుధాకర్రెడ్డి, బలవంత్రెడ్డి, సురేందర్, అర్చకుడు చంద్రశేఖర్శర్మ పాల్గొన్నారు.