మొయినాబాద్, మే 25 : తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి మోడల్ క్రీడా ప్రాంగణాన్ని సర్దార్నగర్లో ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ను ఆదేశించారు. షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాన్ని బుధవారం ఆయన కలెక్టర్ అమయ్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీవో ప్రభాకర్, ఎస్బీఎం డైరెక్టర్ సురేశ్బాబులతో క్రీడా ప్రాంగణం స్థలాన్ని పరిశీలించారు. అక్కడ మొక్కలు నాటారు.
సర్దార్నగర్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ప్రభుత్వం క్రీడా మైదానాల ఏర్పాటుకు చొరవ చూపుతుందన్నారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను నీరుపోసి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్రెడ్డి, ఏపీవో నీరజ, తహసీల్దార్ అమరలింగంగౌడ్, ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్రెడ్డి, సర్పంచ్లు స్వరూప, నర్సింములు, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్రెడ్డి, పీఈటీ రవీందర్గౌడ్, ఏపీవో వీరాసింగ్, ఏపీఎం నర్సింములు తదితరులు పాల్గొన్నారు.