కొడంగల్, మే 22: పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసిట్టినట్లు ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలకు సంబంధించి కొడంగల్లోని జడ్పీ హెచ్ఎస్ బాలుర సెంటర్లో 219, బాలికల పాఠశాలలో ఏ సెంటర్లో 225, బీ సెంటర్లో 240, ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో 240 మొత్తంగా 924 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు సీసీ కెమెరాలతో పాటు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమి షాల వరకు పరీక్ష జరగనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి సెంటర్కు చేరుకోవాలని, పరీక్ష హాల్ టికెట్ ఉం టేనే అనుమతి ఉంటుందని తెలిపారు. అదేవిధం గా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పది పరీక్షా సెంటర్లలో శానిటేషన్ పనులు నిర్వహించి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు కమిషనర్ నాగరాజు తెలిపారు.
బొంరాస్పేటలో రెండు పరీక్షా కేంద్రాలు
బొరాస్పేట, మే 22 : ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం ఏలో 218 మంది, పరీక్షా కేంద్రం బిలో 266 మంది కలిపి మొత్తం 584 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. మం డలంలోని బొంరాస్పేట ఉన్నత పాఠశాల నుంచి 142 మంది, చౌదర్పల్లి నుంచి 66 మంది, దుద్యాల నుంచి 69 మంది, రేగడిమైలారం నుంచి 26 మంది, కేజీబీవీ నుంచి 45 మంది, బొట్లవానితండా ఆశ్రమ పాఠశాల నుంచి 57 మంది, బురాన్పూర్ గురుకుల పాఠశాల నుంచి 179 మంది విద్యా ర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల్లో ఎలాంటి అవ కత వకలు జరుగకుండా పరీక్షా కేంద్రం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు.
కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో..
కులకచర్ల, మే 22 : పదవ తరగతి పరీక్షలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కులకచర్ల, చౌడాపూర్ మండలాల ఎంఈవో అబీబ్హైమద్ తెలిపారు. ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. కులకచర్ల మండలంలో కులకచర్ల బాలు ర, బాలికల, పుట్టపహాడ్, ముజాహిద్పూర్ ఉన్నత పాఠశా లల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా చౌడాపూర్ మం డలంలో చౌడాపూర్ మరికల్ పాఠశాలల్లో పదవ తరగతి పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేం ద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కులకచర్ల మండలంలో 847మంది విద్యార్థులు, చౌడాపూర్ మండలంలో 337మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారని అన్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేం దుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.