తాండూరు రూరల్, మే 21: అభివృద్ధి విషయంలో ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలేదని, నిరంతరం ప్రజల మధ్య ఉంటానని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు. శనివారం ఆమె మండలంలోని ఎల్మకన్నె, నారాయణపూర్, చింతామణిపట్టణం, పర్వతాపూర్, రాంపూర్, సిరిగిరిపేట, కోటబాసుపల్లి, బెల్కటూర్, మల్కాపూర్ గ్రామా ల్లో సీసీరోడ్లు, మురుగు కాలువలతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మె ల్సీ, జడ్పీ నిధులను కేటాయించినట్లు తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దశలవారీగా నియోజకర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని తెలిపా రు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రతి ఇల్లు ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్నదన్నారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు. రానున్న రోజుల్లో యువతలో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు అన్ని గ్రామాల్లో క్రీడా మై దానాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. జిల్లాలో రూ. 7 కోట్ల నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
మన ఊరు-మన బడి కింద పాఠశాలల మరమ్మతులకు రూ.4 కోట్లు కేటాయించినట్లు, అంగన్వాడీ భవనాలు, పాఠశాలల అదనపు గదుల నిర్మాణాలను కూడా పూర్తి చేశామన్నారు. అనంతరం ఎంపీపీ అనిత మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. జడ్పీటీసీ మంజుల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వరూప, పీఏసీఎస్ చైర్మన్ రవీందర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్లు చంద్రప్ప, విమలమ్మ, మేఘనాథ్గౌడ్, రాధిక, విజయలక్ష్మి, లాల్రెడ్డి, ఎంపీటీసీ రాజమణి, పురుషోత్తంరావు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్, తాండూరు టౌన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.