ఇబ్రహీంపట్నం, మే 20: వానకాలం సీజన్లో రంగారెడ్డి జిల్లాలో ప్రదర్శన క్షేత్రాల ద్వారా పం టలను సాగు చేసి రైతుల్లో మరింత చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైన ది. పంటల సాగులో తీసుకోవాల్సిన మెళకువ లు.. ఎలాంటి ఎరువులను వాడాలో..తదితర అంశాలపై ప్రతి క్లస్టర్లోనూ ప్రదర్శన క్షేత్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. రసాయన ఎరువుల వాడకంతో వచ్చే అనర్థాలపై కూడా అక్కడ వివరించనున్నారు. జిల్లాలో 83 క్లస్టర్లలోని సుమారు 83 వేల ఎకరాల్లో ఈ ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటుచేసి పంటల సాగు విధానా న్ని రైతులకు వివరించనున్నారు. ముఖ్యంగా రైతులు వరి పంటను అధికంగా వేస్తుండటంతో కూలీల కొరత ఎక్కువగా పీడిస్తున్నది.
అలాగే, రసాయన ఎరువుల వాడకంతో భూమిలో సాం ద్రత తగ్గిపోతున్నది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రదర్శన క్షేత్రాల్లో వరినాటే పద్ధతి కాకుండా విత్తనాలను వెదజల్లే పద్ధతిలో ఎలా సాగు చేయా లో… డీఏపీకి బదులుగా ఆవు పేడలో పీఎస్జీ ఎరువును కలిపి ఎలా వాడాలో రైతులకు వివరించనున్నారు. అలాగే, జీలుగ, జనుము విత్తనాలతో పచ్చిరొట్ట ఎరువులను తయారు చేసి పంటలను సాగుచేసే విధానంపైనా అవగాహన కల్పించనున్నారు. ప్రతి క్లస్టర్లో వంద ఎకరాల్లో ఈ క్షేత్రాలను ఏర్పాటు చేయనున్నారు.
అందుబాటులో విత్తనాలు..
వానకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచా రు. ఇప్పటికే గ్రామాలవారీగా రైతులు ఏయే పంటలు వేస్తున్నారో పూర్తి స్థాయిలో వివరాలను సేకరించారు. వాటికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలోని ఐదు డివిజన్లల్లోని 83 క్లస్టర్లల్లో సాగుకు సంబంధించిన లెక్కలను పక్కాగా సేకరించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే ఆ షాపులపై వ్యవసాయశాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. దీని ద్వారా జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికడుతున్నారు.
50 శాతం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు
జిల్లాలో జీలుగ, జనుము విత్తనాలను 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు అందిస్తున్నది. జీలుగ, జనుము విత్తనాలను వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. అవసరమైన రైతులు తీసుకెళ్లొచ్చన్నా రు. ఈ విత్తనాలతో పచ్చిరొట్ట ఎరువు తయారీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వానకాలం సీజన్ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లాలో వర్షాకాలంలో 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరితోపాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే పత్తి, మొక్కజొన్న, కంది పంటలను అధికంగా సాగు చేసేలా అధికారులు రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు.
అలాగే, జిల్లాలో కూరగాయల సాగుతోపాటు పందిరి సాగుకు కూడా అధిక ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, యంత్రాలను అందుబాటు లో ఉంచాలని భావిస్తున్నది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ తదితర ప్రాంతాల్లో పత్తిని అధికంగా సాగుచేస్తున్నారు. అలాగే, ఈ మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే అవకాశమున్నందున వ్యవసాయాధికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశారు. అలా గే కూరగాయల సాగును మరింత పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.