చేవెళ్ల టౌన్, మే 20: ‘తెలంగాణ ప్రభుత్వం రికార్ఢు స్థాయిలో ఉద్యోగాల కల్పనకు కార్యాచరణ రూపొందించింది.. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను సైతం జారీ చేసింది.. స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు..’ అని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేద అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రమ మీ ఆయుధమైతే విజయం సొంతమవుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఇది ఒక వరమని, ఇష్టపడి చదివి తమ కలలను సాకారం చేసుకోవాలని మంత్రి సూచించారు.
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఫర్హా ఇంజినీరింగ్ కళాశాలలో నిరుద్యోగ అభ్యర్థుల సౌకర్యార్థం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెం టర్ను ఆమె ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఒకేసారి ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవడం దేశంలో ఎక్కడా జరుగలేదని.. నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ రికార్డు స్థాయిలో వరం ఇచ్చారని కొనియాడారు. శ్రమ మీ ఆయుధమైతే విజయం సొంతమవుతుందన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో స్థానికులకే ఉద్యోగాలు లభించేలా జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి.. పూర్తి స్థాయిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూనే నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో డబ్బులు ఖర్చు చేసుకోకుండా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలతో ఉచితంగా కోచిం గ్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఎమ్మెల్యే యాదయ్య ఉచితంగా కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే యాద య్య మాట్లాడుతూ ఉద్యోగార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. ఈ సెంటర్లో ఉచితంగా మధ్యాహ్న భోజన సౌక ర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవరావు, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, చేవెళ్ల తహసీల్దార్ అశోకుమార్, ఎంపీటీసీ సత్యనారాయణ, నాయకులు నాగార్జునరెడ్డి, వెంకటేశ్ తదిరుతులు ఉన్నారు.