పరిగి, మే 20: పదోతరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈనెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయ గా 14,441 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నా రు. అన్ని కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులను అధికారులు కల్పిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో కంటే ఈసారి 15 నిమిషాలు అదనంగా సమయాన్ని అధికారులు పెంచడం జరిగింది.
జిల్లాలో 14,441 మంది విద్యార్థులు
ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు వికారాబాద్ జిల్లాలో 14,441 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లాలోని 164 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి 7,336 మంది విద్యార్థులు, 9 ప్రభుత్వ పాఠశాలల నుంచి 476 మంది, 7 ఎయిడెడ్ పాఠశాలల నుంచి 254 మంది, 18కస్తూర్బాగాంధీ విద్యాలయాల నుంచి 843 మం ది, 9 మోడల్ స్కూళ్ల నుంచి 875 మంది, 6 మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల నుంచి 462 మంది, 10 ఎస్టీ ఆశ్రమ, గిరిజన గురుకులాల నుంచి 546 మంది, 6 టీఎంఆర్ఐఈఎస్ల నుంచి 290 మంది, 2 టీఎస్ఆర్ఈఐఎస్ల నుంచి 156 మంది, 9 సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 709 మంది, 89 ప్రైవేటు పాఠశాలల నుంచి 2,494 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు..
జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన టెన్త్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, కస్టోడియన్లు ఉండే గదుల్లో వీటిని ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రశ్నాపత్రాల ప్యాకెట్లు సీసీ కెమెరాల నిఘాలోనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాల ప్యాకింగ్ కూడా సీసీ కెమెరాల నిఘాలోనే చేపట్టాలి. పరీక్షా కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే ఏఎన్ఎంలు పరీక్షా కేంద్రాల్లో అందుబాటు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు తాగునీటితోపాటు మౌలిక వసతులను కల్పిస్తున్నారు. పరీక్షా కేం ద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతిలేదు. విద్యార్థులు పరీక్షా కేం ద్రాలకు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సులను ఆయా రూ ట్ల వారీగా నడుపనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా ఐదు నిమిషాలను గ్రేస్ పీరియడ్గా ఇవ్వనున్నారు.
విద్యార్థులు గంట ముందే చేరుకోవాలి
పదోతరగతి పరీక్షల కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 70 పరీక్షా కేం ద్రాలను ఏర్పాటు చేయగా 14, 441 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30కే పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి.
–రేణుకాదేవి, జిల్లా విద్యా శాఖ అధికారి వికారాబాద్