ధారూరు, మే 16: దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో దళితబంధు పథకం లబ్ధిదారు ధారూరు మండలం కెరెళ్లి గ్రామానికి చెందిన బేగరి రాజుకు ట్రాక్టర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదగాలనే తపనతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని, లబ్ధిపొందినవారు సద్విని యో గం చేసుకో వాలన్నారు. కార్య క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ధా రూరు మండల అధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్య దర్శి రాజూగుప్తా, ఏఎంసీ చైర్మ న్ సంతోశ్కుమార్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, నాయ కులు వేణుగోపాల్రెడ్డి, రాము లు పాల్గొ న్నారు.
దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు
మర్పల్లి, మే16: దళితుల అభ్యున్నతి కోసమే రాష్ట్ర ప్రభు త్వం దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. మండలం లోని బిల్కల్ గ్రామానికి చెందిన ఎం.నరేందర్కు దళిత బంధు పథకంలో భాగంగా సోమవారం ట్రాక్టర్ను కోనుగోలు చేసి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.