ఇబ్రహీంపట్నం రూరల్, మే 16 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని రాయపోల్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1.21 కోట్లు కేటాయించింది. ఆ పనులను సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థను తెలంగాణలో పటిష్ట పర్చటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నాడు ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయటంతో పాటు విద్య, వైద్యం, నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుభాగంలో ఉందన్నారు. ఓ వైపు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో సీఎం కేసీఆర్ ముందుకు నడిపిస్తుంటే ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు.
ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్షా సైతం అబద్ధపు ప్రచారాలు చేయ టం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు సగౌరవంగా జీవించాలన్న సంకల్పంతో ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించే విధంగా ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు, అత్యాధునిక వసతులతో లైబ్రరీ, సైన్స్ల్యాబ్, క్రీడామైదానంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఎంపికైన ప్రతి పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పరీక్షప్యాడ్లు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, సహకార సంఘం వైస్ చైర్మన్ కాంటేకార్ ఈశ్వర్, సర్పంచ్ బల్వంత్రెడ్డి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు బాలుగౌడ్, టీఆర్ఎస్ నాయకులు జెర్కోని రాజు, పాతూరి రాజేశ్గౌడ్, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.