షాబాద్, మే 16 : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్, వికారాబాద్ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, మెతుకు ఆనంద్, టీఆర్ఎస్ పార్టీ యువ నేత పి. కార్తీక్రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా బొకె పంపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు అవినాశ్రెడ్డి, మర్పల్లి మాలతీ, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, కాలె జయమ్మ, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, గోవర్ధన్రెడ్డి, గునుగుర్తి నక్షత్రం, కాలె భవాని, టీఆర్ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, నాగిరెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా పాల్గొన్నారు.
వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
చేవెళ్లటౌన్ : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చేవెళ్లలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.అనంతరం కేక్ కట్ చేశారు. కేజీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు.
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ఎమ్మెల్యే
మొయినాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి , అర్చకులు రంగరాజన్ స్వామి వారి వస్ర్తాన్ని, పూల మాలను ఎమ్మెల్యేకు వేసి ఆశీర్వదించారు. ఎంపీపీ నక్షత్రం, సర్పంచ్ స్వరూప ఎమ్మెల్యే చేత కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ సంగరి మల్లేశ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, చిలుకూరు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్ రాంచందర్ పాల్గొన్నారు.