తలకొండపల్లి, మే 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని దేవకి గార్డెన్స్లో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 119 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది పేదలు తమ ఆడబిడ్డల పెండ్లి చేయడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపట్టారని తెలిపారు.
రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్, రమేశ్, సర్పంచ్లు లలిత, ఈశ్వర్నాయక్, రమేశ్, రమేశ్యాదవ్, చంద్రయ్య, కుమార్, శ్రీశైలం, రామస్వామి, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం మండల వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.