కొత్తూరు రూరల్, మే 16: జేపీ దర్గా అభివృద్ధి, విస్తరణలో భాగంగా దర్గాలోని వ్యాపారస్తులందరికీ న్యాయం చేకూరుతుందని షాద్నగర్ ఆర్డీవో రాజేశ్వరి అన్నారు. మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ జహంగీర్పీర్ దర్గాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం రెవెన్యూ అధికారులు సోమవారం ఎంజాయ్మేంట్(భూసర్వే)సర్వేను నిర్వహించారు. సర్వేలో భాగంగా ఆర్డీవో రాజేశ్వరి, వక్ఫ్ డీఎస్పీ ఖాజామోయినుద్దీన్, జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ గౌస్ మోహినుద్దీన్, తహసీల్దార్ కె. రాములు, ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఇంతియాజ్, అబ్దుల్ హఫీజ్, వక్ఫ్ సర్వేయర్ సుజాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. దీంతో తమ భూములను, దుకాణాలను కోల్పోతున్నామని, తమకు జీవనోపాధిని తిరిగి కల్పించాలని వ్యాపారస్తులు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆర్డీవో రాజేశ్వరి మాట్లాడుతూ.. భూములు, దుకాణాలను కోల్పోతున్న వారికి ప్రభుత్వం ప్రభుత్వ భూమిలో వారికి భూమిని, దుకాణాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దీంతో వ్యాపారస్తులు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఆర్ఐలు సహదేవరెడ్డి, రాంబాబు, సర్వేయర్లు మధుసూదన్రెడ్డి, మహేశ్, భీమ్లానాయక్, సిబ్బంది భాస్కర్, హరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.