తాండూరు, మే 14 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శనివారం యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్లో రూ.18లక్షల డీఎంఎఫ్టీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులు, మురుగుకాలువలు, అక్కంపల్లిలో రూ.4లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులు, పగిడిపలిల్లో రూ.8లక్షల డీఎంఎఫ్టీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, రేళ్లగడ్డతండాలో రూ.4లక్షల డీఎంఎఫ్టీ నిధులతో మురుగు కాలువలు, పటేల్చింతతండాలో రూ.3లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులు, జుంటుపల్లిలో రూ.13లక్షల డీఎంఎఫ్టీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, దౌలాపూర్లో రూ.3లక్షల డీఎంఎఫ్టీ నిధులతో సీసీ రోడ్లు, గిరిజాపూర్లో రూ.3లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, బండమీదిపల్లిలో రూ.3లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, అగ్గనూరులో రూ.20లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, పేర్కంపల్లిలో రూ.7లక్షల డీఎంఎఫ్టీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పేర్కంపల్లితండాలో రూ.3లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, ఎన్కెపల్లిలో రూ.10లక్షల డీఎంఎఫ్టీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే రోహిత్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, తండాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు పథకంతో రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువలు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలతో పల్లెల రూపురేఖలు మారిపోయాయన్నారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు ప్రత్యేక నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు నేరుగా తమకు తెలుపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, టీఆర్ఎస్ పార్టీ యాలాల మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.