కేశంపేట, మే 14 : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని భైర్ఖాన్పల్లి, కొత్తపేట, లేమామిడి, తొమ్మిదిరేకుల, కాకునూరు, వేములనర్వ, పాపిరెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నదని, అందులో భాగంగా కేశంపేట మండలానికి 2 కోట్ల 25 లక్షల రూపాయలను పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మంజూరైన నిధులతో నూతన పాఠశాల భవనాలు, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫర్నిచర్, వంటగదుల నిర్మాణం వంటి వసతులను కల్పిస్తామన్నారు.
అన్నివర్గాల నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేసి వారికి ఉజ్వల భవిష్యత్ను కల్పించడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, వారి భవిష్యత్కు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు కృష్ణయ్య, నవీన్కుమార్, శ్రీశైలంగౌడ్, సావిత్రి, లక్ష్మమ్మ, మంజుల, విష్ణువర్ధ్దన్రెడ్డి, వెంకట్రెడ్డి, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ఇన్చార్జి ఎంఈవో మనోహర్, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్, రసూల్, టీఆర్ఎస్ నాయకులు మురళీధర్రెడ్డి, యాదగిరిరావు, శ్రావణ్రెడ్డి, వేణుగోపాలాచారి, లక్ష్మయ్య, పర్వత్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.